Suhas: ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు!
‘‘ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరించే చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’ (Writer padmabhushan). సినిమా చూసి అందరూ బరువైన భావోద్వేగాలు.. మంచి చిరునవ్వులతో బయటకొస్తారు’’ అన్నారు నటుడు సుహాస్ (Suhas).
‘‘ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరించే చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. సినిమా చూసి అందరూ బరువైన భావోద్వేగాలు.. మంచి చిరునవ్వులతో బయటకొస్తారు’’ అన్నారు నటుడు సుహాస్ (Suahs). ‘కలర్ఫొటో’ (Colour Photo)తో తొలి ప్రయత్నంలోనే హీరోగా మెప్పించిన ఆయన.. ఇప్పుడు ‘రైటర్ పద్మభూషణ్’ (Writer Padmabhushan)గా వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. షణ్ముఖ ప్రశాంత్ తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు సుహాస్.
* ‘‘ఇది చాలా మంచి కుటుంబ కథా చిత్రం. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ప్రథమార్ధంలో రెండు, ద్వితీయార్థంలో మూడు ట్విస్ట్లు వస్తాయి. క్లైమాక్స్లో ఇంకా చాలా మంచి ట్విస్ట్ ఉంటుంది. ప్రతి మలుపుని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా క్లైమాక్స్కు అందరూ కనెక్ట్ అవుతారు. ఆశిష్ విద్యార్థి, రోహిణీ, గోపరాజు రమణ లాంటి నటులు ఇందులో భాగమవ్వడం మా అదృష్టం’’.
* ‘‘ప్రశాంత్ నా ‘కలర్ఫొటో’ చిత్రానికి సహాయ దర్శకుడిగా చేశాడు. తర్వాత ‘ఫ్యామిలీ డ్రామా’ సినిమాకి రచయితగా చేశాడు. ఆ తర్వాత తను నాకీ కథ చెప్పాడు. విన్న వెంటనే బాగా నచ్చి చేస్తానని చెప్పా. ఈ సినిమాని మేము 60రోజుల్లో పూర్తి చేయాలనుకున్నాం. కానీ, పక్కా ప్రణాళికతో 43రోజుల్లోనే పూర్తి చేశాం. మేము ట్రైలర్లో చెప్పనిది ఒకటి సినిమాలో వస్తుంది. అదేంటన్నది తెరపై చూస్తేనే బాగుంటుంది’’.
* ‘‘ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు చిన్న పాత్రలు చేస్తే చాలనుకున్నాను. ఇప్పుడు చాలా మంచి పాత్రలొస్తున్నాయి. రచయితల వల్లే చాలా విభిన్నమైన పాత్రలు పోషించే అవకాశం దొరుకుతోంది. ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదని నా మిత్రులతో అంటుంటా. ప్రస్తుతం నేను గీతా ఆర్ట్స్2లో ఓ చిత్రం చేస్తున్నా. చిత్రీకరణ పూర్తయింది. అలాగే ‘ఆనందరావు అడ్వంచర్స్’ అనే మరో సినిమా చేస్తున్నా’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..