Adipurush: ‘ఆదిపురుష్‌’ టీజర్‌పై రామాయణం సీరియల్‌ నటుడు ఏమన్నారంటే...!

ప్రభాస్‌ నటించిన ‘ఆదిపురుష్‌’ టీజర్‌ విడుదలైన దగ్గరి నుంచి ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ‘రామాయణం’ సీరియల్‌లో లక్ష్మణుడి పాత్రతో మెప్పించిన సునీల్‌ లహ్రీ ఓ ఇంటర్వ్యూలో ఆదిపురుష్‌ టీజర్‌ గురించి ఇలా మాట్లాడారు.

Published : 08 Oct 2022 01:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ నటించిన ‘ఆదిపురుష్‌’ టీజర్‌ విడుదలైనప్పటి నుంచి ఎన్నో ప్రతికూల వ్యాఖ్యలు... భారతీయ సంస్కృతిని తక్కువ చేసి చూపించారన్న విమర్శలు. సరిగ్గా ఈ నేపథ్యంలో ఒకప్పుడు దూరదర్శన్‌లో ప్రసారమైన రామాయణ్‌ సీరియల్‌లో లక్ష్మణుడిగా గుర్తింపు పొందిన సునీల్‌ లహ్రీ ఈ టీజర్‌పై స్పందించారు.

‘‘ఆదిపురుష్‌ టీజర్‌ చూశా. బాగుంది, బాలేదని నేను ఏమీ చెప్పలేను. ఎందుకంటే ప్రస్తుతానికి నా ఆలోచనలు తటస్థంగా ఉన్నాయి. సినిమాలోని పాత్రలు, వారి ఆహార్యాన్ని మాత్రమే పరిచయం చేశారు. సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లడానికే ఇలాంటి కాంట్రవర్సీలు క్రియేట్‌ చేస్తున్నారనిపిస్తోంది. రామాయణం కథ మనందరికీ తెలుసు. గత కొన్నేళ్లుగా రాముడంటే ఇలానే ఉంటాడని మనందరిలో ఓ ఆలోచన ఏర్పడిపోయింది. ఆ ఆలోచనను బ్రేక్‌ చేస్తూ నటీనటుల లుక్స్‌ను కొత్తగా చూపించారు. మన విశ్వాసాలకు వ్యతిరేకంగా అర్థంలేని విధంగా ఏదైనా చూపిస్తే  ప్రేక్షకులు సహించరు. తమ సత్తా ఏమిటో ఇప్పటికే వాళ్లు పలు సందర్భాల్లో బయటపెట్టారు’’ అని సునీల్‌ లహ్రీ అన్నారు. తాజాగా ఈ వివాదంపై నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘ఆది పురుష్‌’లాంటి సినిమా సెల్‌ఫోన్స్‌లో చూసే మూవీ కాదని, థియేటర్లలో చూడాలని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు