తెలుగు ఫ్యాన్స్‌పై బీటౌన్‌ నటుడి వ్యాఖ్యలు

బాలీవుడ్‌తో పోలిస్తే టాలీవుడ్‌ ఐదు రెట్లు ఉన్నతంగా పనిచేస్తోందని ప్రముఖ నటుడు సునీల్‌శెట్టి అన్నారు. కథానాయకుడిగా, సహాయనటుడిగా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీల్ శెట్టి‌....

Updated : 07 Dec 2022 22:17 IST

హైదరాబాద్‌: బాలీవుడ్‌తో పోలిస్తే టాలీవుడ్‌ ఐదు రెట్లు ఉన్నతంగా పనిచేస్తోందని ప్రముఖ నటుడు సునీల్‌శెట్టి ప్రశంసించారు. కథానాయకుడిగా, సహాయనటుడిగా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన‌.. తాజాగా తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన మంచువిష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘మోసగాళ్లు’లో కీలకపాత్ర పోషించారు. మార్చి 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తెలుగు సినిమా, ఇక్కడి అభిమానుల గురించి సునీల్‌ శెట్టి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘దక్షిణాది చిత్రపరిశ్రమ ఎన్నో ఉన్నతమైన విలువల్ని పాటిస్తుంది. 30 ఏళ్ల క్రితమే ఈ మాట చెప్పాను. ఎన్నో విభిన్నమైన కథలతో ప్రేక్షకుల్ని అలరిస్తోంది. బాలీవుడ్‌తో పోలిస్తే టాలీవుడ్‌లో ఎన్నో ఉన్నతమైన సినిమాలు వస్తున్నాయి. ఇక్కడ సినిమాపై మమకారం ఎక్కువగా ఉన్న అభిమానులు ఉన్నారు’’

‘‘టాలెంట్‌ ఆధారంగా ఇక్కడి నటీనటులు అక్కడికి.. అక్కడివారు ఇక్కడి సినిమాల్లో నటించడం మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. తెలుగు నటీనటులు హిందీ సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నారు. గడిచిన 30 సంవత్సరాలుగా హైదరాబాద్‌కు షూటింగ్‌ కోసం వస్తున్నా. ఇక్కడి పని సంస్కృతి ఎంతో చక్కగా ఉంటుంది. షూటింగ్‌ జరుగుతున్నప్పుడు కొన్ని వందలమంది లొకేషన్‌కు వస్తారు. కానీ ఇబ్బంది కలిగించరు. నాకు మాత్రమే కాదు నా సతీమణికి కూడా హైదరాబాద్‌ అంటే ఎంతో ఇష్టం’’ అని సునీల్‌శెట్టి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని