యువరాణిగా సన్నీ లియోనీ

సన్నీ లియోనీ తొలుత బాలీవుడ్‌లో అడుగుపెట్టి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ తర్వాత దక్షిణాదిలోనూ తన సత్తా చాటుతోంది. తెలుగులో ఆమె ‘కరెంట్‌తీగ’లో కనిపించి మెరుపులు కురిపించింది. రాజశేఖర్‌ హీరోగా నటించిన ‘పి.ఎస్‌.వి: గరుడవేగ’ చిత్రంలో ప్రత్యేకగీతంలో కనువిందు చేసింది.

Updated : 10 Aug 2022 12:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్: సన్నీ లియోనీ తొలుత బాలీవుడ్‌లో అడుగుపెట్టి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ తర్వాత దక్షిణాదిలోనూ తన సత్తా చాటుతోంది. తెలుగులో ఆమె ‘కరెంట్‌ తీగ’లో కనిపించి మెరుపులు కురిపించింది. రాజశేఖర్‌ హీరోగా నటించిన ‘పి.ఎస్‌.వి: గరుడవేగ’ చిత్రంలో ప్రత్యేకగీతంలో కనువిందు చేసింది. ప్రస్తుతం తమిళంలో ఓ హర్రర్‌ కామెడీ చిత్రంలో నటించనుంది. ఇందులో ఆమె యువరాణిగా కనుపిస్తుందట. ఈ చిత్రానికి ఆర్‌.యువన్‌ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో సతీష్‌, సౌమ్య మీనన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీఏయు మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్, వైట్‌ హార్స్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి. డీవీ శక్తి నిర్మాత. జావేద్ రియాజ్‌ సంగీతం అందిస్తారు. దీప్‌క్ డీ మీనన్‌ ఛాయాగ్రహకుడు.

ఈ చిత్రం గురించి దర్శకుడు ఆర్‌.యువన్‌ స్పందిస్తూ..‘‘ఇది ఒక ఫాంటసీ హర్రర్ కామెడీ చిత్రం. చిత్ర కథ వేర్వేరు కాలాల్లో ప్రయాణించనుంది. ఈ సినిమాలో సన్నీ యువరాణిగా నటిస్తోంది. ఈ పాత్ర అనుకున్నప్పుడు సన్నీ లీయోనీ తప్ప మరొకరి గురించి ఆలోచించలేదు. సినిమా కోసం ముంబయిలో భారీ ప్యాలెస్ సెట్లను నిర్మించాం. అక్కడే 25 రోజుల పాటు చిత్రీకరణ చేస్తాం’’ అని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. తను తెలుగులో ‘రణం’, ‘ఖతర్నాక్‌’ సినిమాలకు స్క్రిప్ట్ అందించానని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని