ఆ క్రైమ్‌ చిత్రానికి సీక్వెల్‌ రాబోతుంది!

చిత్ర పరిశ్రమలో ఈ మధ్య సీక్వెల్‌  జోరు బాగానే కనిపిస్తోంది. ఆ జాబితాలో మరో సూపర్ హిట్‌ చిత్రం చేరబోతుంది.

Published : 25 Mar 2021 01:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అన్ని చిత్ర పరిశ్రమల్లో ఈ మధ్య సీక్వెల్‌  జోరు బాగానే కనిపిస్తోంది. ఆ జాబితాలో మరో సూపర్ హిట్‌ తెలుగు చిత్రం చేరబోతుంది. క్రైమ్‌ కామెడీ నేపథ్యంలో వచ్చి ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించిన ‘స్వామి రారా’కి కొనసాగింపుగా మరో సినిమాకి రంగం సిద్ధమవుతుంది. నిఖిల్‌, స్వాతి జంటగా దర్శకుడు సుధీర్‌ వర్మ తెరకెక్కించిన చిత్రమిది. 2013 మార్చి 23న విడుదలైన ఈ చిత్రం మంగళవారంతో 8 ఏళ్లు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా కథానాయకుడు నిఖిల్‌ ట్విటర్‌ వేదికగా చిత్ర దర్శకుడ్ని సీక్వెల్‌ గురించి అడిగారు. ‘ సీక్వెల్‌ ఉంటుంది.. లోడింగ్‌’ అంటూ బదులిచ్చారు సుధీర్‌ వర్మ. పూర్తి వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. సరికొత్త  స్ర్కీన్‌ప్లేతో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే ఈ చిత్రం ప్రేక్షకులకి మంచి అనుభూతి పంచింది. ప్రస్తుతం నిఖిల్‌ ‘కార్తికేయ’ సీక్వెల్‌, ‘18 పేజస్‌’లో నటిస్తున్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని