SSMB 28: మహేశ్‌ త్రివిక్రమ్‌ ప్రాజెక్ట్‌ షురూ.. తళుక్కున మెరిసిన హీరోయిన్‌..!

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు తదుపరి ప్రాజెక్ట్‌ మొదలైంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. మహేశ్‌బాబు 28వ చిత్రంగా ఇది సిద్ధం కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్‌ పతాకంపై చినబాబు ...

Updated : 03 Feb 2022 15:18 IST

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు తదుపరి ప్రాజెక్ట్‌ మొదలైంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. మహేశ్‌బాబు 28వ చిత్రంగా ఇది సిద్ధం కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్‌ పతాకంపై చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం ఉదయం ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో వేడుకగా జరిగింది. చిత్రబృందంతోపాటు మహేశ్‌బాబు సతీమణి నమ్రత ఈ వేడుకలో పాల్గొన్నారు. పూజాహెగ్డే సైతం తళుక్కున మెరిశారు. ఇక మహేశ్‌బాబు ఈ వేడుకకు దూరంగా ఉన్నారు.

‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత మహేశ్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలున్నాయి. ఓ పవర్‌ఫుల్‌ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో మహేశ్‌ సరసన పూజాహెగ్డే సందడి చేయనున్నారు. ‘మహర్షి’ తర్వాత ఈ సినిమా కోసమే వీరిద్దరి కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు. మరోవైపు మహేశ్‌ ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ షూట్‌లో బిజీగా ఉన్నారు.

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని