Rajini kanth: ఒకేసారి రెండు ప్రాజెక్టులకు రజనీ గ్రీన్‌ సిగ్నల్‌.. ఆ రోజే ప్రారంభం

రజనీకాంత్‌ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ రెండు భారీ చిత్రాలను నిర్మించనుంది. త్వరలోనే అవి ప్రారంభంకానున్నాయి.

Published : 28 Oct 2022 20:25 IST

చెన్నై: ప్రముఖ నటుడు రజనీకాంత్‌ (Rajini kanth) రెండు క్రేజీ ప్రాజెక్టులకు శుక్రవారం పచ్చ జెండా ఊపారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ (Lyca Productions) పతాకంపై రూపొందనున్న సినిమాల్లో ఆయన కథానాయకుడిగా నటించనున్నారు. ఈ వివరాలను ప్రకటిస్తూ సంస్థ ఛైర్మన్‌ సుభాస్కరన్‌, డిప్యూటీ ఛైర్మన్‌ ప్రేమ్‌శివస్వామి ఆనందం వ్యక్తం చేశారు. రజనీకాంత్‌తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. ఆ రెండు సినిమాలను నవంబరు 5న చెన్నైలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభిస్తామని తెలిపారు.

వాటిని తెరకెక్కించబోయే దర్శకులు, రజనీ సరసన నటించే కథానాయికలు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాలు రూపొందనున్నాయి. ఇదే సంస్థ రజనీకాంత్‌తో గతంలో ‘2.ఓ’ సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రం ఈ బ్యానర్‌లో తెరకెక్కిందే. రజనీకాంత్‌ ప్రస్తుతం ‘జైలర్‌’ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి నెల్సన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది రజనీకి 169వ సినిమా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని