
‘మిర్జాపూర్’కు సుప్రీం కోర్టు నోటీసులు
ముంబయి: ఈ మధ్యకాలంలో ఓటీటీల వేదికగా అలరిస్తున్న వెబ్సిరీస్లలో ‘మిర్జాపూర్’ ఒకటి. ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్ అనే నగరంలో రౌడీ రాజకీయాలు, హత్యలు, అక్రమ వ్యాపారాల నేపథ్యంలో ఈ వెబ్సిరీస్ను తెరకెక్కించారు. మొదటి సీజన్ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకోవడంతో రెండో సీజన్ను కూడా విడుదల చేశారు. అది కూడా బాగానే అలరిస్తోంది. ఇదంతా ఇలా ఉండగా.. తాజాగా ఈ వెబ్సిరీస్ నిర్మాతలతో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్కు సుప్రీం కోర్టు నోటీసులు పంపింది. అసలేం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్తో పాటు మిర్జాపూర్ ప్రాంతీయ మనోభావాలు, మతవిశ్వాసాలను దెబ్బతీయడం, హింసను ప్రేరేపించేలా వెబ్సిరీస్లో చాలా సన్నివేశాలు ఉన్నాయంటూ మిర్జాపూర్కు చెందిన అరవింద్ చతుర్వేది స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాంతోపాటు సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా వేశారు. పిల్ను పరిశీలించిన సుప్రీంకోర్టు.. వెబ్ సిరీస్ నిర్మాత, అమెజాన్ ప్రైమ్ వీడియోకు నోటీసులు జారీ చేసింది. వెంటనే తమ స్పందన తెలియజేయాలని కోరింది. పిటిషనర్ ఇచ్చిన జాబితాలో మిర్జాపూర్ నిర్మాతలు రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్, భౌమిక్ గొండాలియా ఉన్నారు.
ఈ వెబ్సిరీస్లో తమ నగరాన్ని చెడుగా చూపించి మిర్జాపూర్ పేరును భ్రష్టుపట్టిస్తున్నారంటూ గతంలో స్థానిక ఎంపీ అనుప్రియపటేల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వెబ్సిరీస్పై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు విజ్ఞప్తి చేశారు. బాలీవుడ్ నటి కంగన సైతం ఈ వెబ్సిరీస్ను వ్యతిరేకించింది. ఇందులో పాత్రలను అన్వయించుకొని ఓ యువకుడు ప్రేమపేరుతో ఓ యువతిని హత్య చేసినట్లు తేలడంతో కంగన ఈ సిరీస్పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
కాగా.. ఇటీవల కాలంలో ఓ వెబ్సిరీస్ వివాదంలో ఇరుక్కోవడం ఇది రెండోసారి. సైఫ్ అలీఖాన్ నటించిన ‘తాండవ్’ వివాదాల్లో ఇరుక్కొని క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలు ఎదురుకావడంతో సిరీస్లో మార్పులు చేస్తున్నట్లు డైరెక్టర్ ప్రకటించారు. తాజాగా.. ‘మిర్జాపూర్’ కూడా వివాదాల్లోకి ఎక్కింది. అయితే.. ఈ రెండు వెబ్సిరీస్లూ అమెజాన్ ప్రైమ్లోనే ప్రసారం అవుతుండటం గమనార్హం. క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ వెబ్సిరీస్కు గుర్మీత్సింగ్ దర్శకత్వం వహించారు. పంకజ్త్రిపాఠి, అలీఫజల్, దివ్యెందు, శ్వేతాత్రిపాఠి, రసికాదుగల్ కీలక పాత్రల్లో నటించారు.
ఇవీ చదవండి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Boris Johnsion: ప్రపంచంలోనే ఉత్తమ జాబ్ వదులుకోవడం బాధగా ఉంది!
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
Sai pallavi: సినీనటి సాయిపల్లవి పిటిషన్ను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
-
General News
MP Arvind: ఎంపీగా ఉన్న నాపైనే హత్యాయత్నం జరిగింది.. సీపీని తప్పించాలి: అర్వింద్
-
General News
covid cases: తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా.. కొత్తగా 592 కేసులు
-
Movies News
Social Look: క్యాప్షన్ కోరిన హన్సిక.. లావణ్య త్రిపాఠి ఫైర్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
- Naga Chaitanya: నువ్వే నాకు ప్రేమించడం నేర్పించావ్.. చై ఎమోషనల్ పోస్ట్
- ప్రసవం తర్వాత.. ఆ భాగం బిగుతుగా మారాలంటే..
- Elon Musk: ఉద్యోగితో మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన మస్క్?
- Nagababu: భీమవరం సభలో చిరంజీవి తప్ప మిగిలిన వారి నటన అద్భుతం: నాగబాబు ట్వీట్
- పాఠాలు చెప్పలేదని.. రూ.24లక్షల జీతం తిరిగిచ్చేసిన ప్రొఫెసర్
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- IND vs ENG : ధనాధన్ వేళాయె..
- Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునాక్.. ఆయన గురించి తెలుసా?
- Chandrababu: చంద్రబాబు వేలికి ప్లాటినం ఉంగరం.. దాని వెనక కథేంటి?