Suriya: ‘జై భీమ్‌’తో ఎవరినీ కించపరిచి పబ్లిసిటీ పొందాలనే ఉద్దేశం లేదు

నటుడు సూర్య ఇటీవల విడుదలైన తన చిత్రం  ‘జై భీమ్‌’పై వచ్చిన విమర్శలపై స్పందించారు. ఇందులోని సన్నివేశాలు తమిళనాడు ఉత్తర భాగానికి చెందిన ‘వన్నియార్లు’ అనే కమ్యూనిటీని అవమానించిందని పీఎంకే యువజన నాయకుడు అన్బుమణి రామదాస్ ఆరోపించారు. దీనిపై  సూర్య ఏ విధంగా స్పందించారంటే...

Published : 15 Nov 2021 01:31 IST

నటుడు సూర్య

చెన్నై: నటుడు సూర్య ఇటీవల విడుదలైన తన చిత్రం ‘జై భీమ్‌’పై వచ్చిన విమర్శలపై స్పందించారు. ఇందులోని సన్నివేశాలు తమిళనాడు ఉత్తర భాగానికి చెందిన ‘వన్నియార్లు’ అనే కమ్యూనిటీని అవమానించిందని పీఎంకే యువజన నాయకుడు అన్బుమణి రామదాస్ ఆరోపించారు. దీనిపై  సూర్య ఏ విధంగా స్పందించారంటే..

నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా..

‘‘నా తోటి మనుషుల జీవితాలను మెరుగుపరిచేందుకు నా వంతు గట్టి ప్రయత్నం చేస్తున్నా. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుంచి నాకు మద్దతు ఉంది. ఎవరినీ దూషించి పబ్లిసిటీ పొందాలనే ఉద్దేశం కానీ, అవసరం కానీ నాకు లేదు. ఏ వర్గాన్నీ అవమానించే ఉద్దేశం మా చిత్ర బృందానికి లేదు. కొన్ని ఉదంతాలు ఎత్తి చూపిన వెంటనే సినిమాలో మార్పులు చేశాం. ఏదైనా ఒక వర్గాన్ని కించపరిచేందుకు భావప్రకటనా స్వేచ్ఛను ఉయోగించుకూడదు’’

నిరూపిస్తాం... వాటికి ఆధారాలు ఉన్నాయి

ఈ చిత్రం ఒక డాక్యుమెంటరీ కాదు. ఒక వాస్తవ సంఘటన ఆధారంగా కథ కల్పితమని డిస్‌క్లైమర్‌ (disclaimer)తో మొదలువుతుంది. ఇందులోని సన్నివేశాలు కానీ పేర్లు కానీ ప్రత్యేకంగా ఒకరిని లేదా ఏదైనా సంఘటనను ఉద్దేశించి తీసినవి కావు. బలహీనత గురించి నిజంగా పట్టించుకోని వారు వారిపై తమ అధికారాన్ని ఉపయోగిస్తారు. ఇందులో కులం, మతం, భాష, జాతి అనే పట్టింపులు ఉండవు ప్రపంచమంతటా దీనిని నిరూపించడానికి ఆధారాలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని