Suriya: ఓటీటీలోకి సూర్య ‘ఈటి’ .. స్ట్రీమింగ్‌ అప్పటి నుంచే!

సూర్య నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఈటి: ఎవరికీ తలవంచడు’. పాండిరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంక అరుళ్‌మోహన్‌ కథానాయిక.

Published : 31 Mar 2022 16:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సూర్య నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఈటి: ఎవరికీ తలవంచడు’. పాండిరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంక అరుళ్‌మోహన్‌ కథానాయిక. థియేటర్లలో ఇటీవల విడుదలై సందడి చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. ‘సన్‌ నెక్ట్స్‌’లో ఏప్రిల్‌ 7 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. 

కథేంటంటే: ద‌క్షిణ‌పురానికి చెందిన కృష్ణ‌మోహ‌న్ (సూర్య‌) ఓ లాయ‌ర్‌. చిన్నప్పుడే త‌న చెల్లిని పోగొట్టుకుంటాడు. అప్ప‌ట్నుంచి అన్నా అని ఏ ఆడపిల్ల సాయం అడిగినా కాద‌న‌డు. ప‌క్క‌నే ఉన్న ఉత్త‌ర‌పురంలో త‌న ఊరు ద‌క్షిణ‌పురానికి చెందిన ఎంతో మంది ఆడ‌ప‌డుచులు ఉంటారు. అత్తారింటిక‌ని వెళ్లిన త‌న ఊరి అమ్మాయిలంతా కామేశ్ (విన‌య్ రాయ్‌) వ‌ల్ల ఇబ్బందుల్లో ప‌డ‌తారు. త‌నకున్న ప‌లుకుబ‌డితో అమాయ‌క‌మైన ఆడ‌పిల్ల‌ల జీవితాల‌తో కామేశ్‌ ఆడుకుంటుంటాడు. ఆ దుర్మార్గుడి ఆట క‌ట్టించ‌డం కోసం ఒక న్యాయ‌వాదిగా కృష్ణ‌మోహ‌న్  ఏం చేశాడు? వేటగాడిగా ఎందుకు మారాడు? అన్నది మిగతా కథ. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి డి. ఇమ్మాన్‌ సంగీతం అందించారు. ఎడిటింగ్‌: రుబెన్‌; సినిమాటోగ్రఫీ: ఆర్‌.రత్నవేలు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని