Suriya: సూర్య ‘ఈటీ’.. కొత్త విడుదల తేదీ ఇదే!

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు సూర్య హీరోగా రూపొందిన చిత్రం ‘ఈటీ’ (ఎతర్‌క్కుమ్‌ తునిందవన్). పాండిరాజ్‌ దర్శకుడు.

Published : 01 Feb 2022 23:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ ప్రముఖ నటుడు సూర్య హీరోగా రూపొందిన యాక్షన్‌- థ్రిల్లర్‌ చిత్రం ‘ఈటీ’ (ఎతర్‌క్కుమ్‌ తునిందవన్). పాండిరాజ్‌ దర్శకుడు. ఈ సినిమా కొత్త విడుదల తేదీని చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. మార్చి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. సన్‌ పిక్చర్స్‌ నిర్మించిన ఈ సినిమాలో సూర్య సరసన ప్రియాంక అరుళ్‌ మోహన్‌ నటించింది. వినయ్‌రామ్‌, సత్యరాజ్‌, జయప్రకాశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డి. ఇమ్మాన్‌ సంగీతం అందించారు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన చిత్ర బృందం అనివార్య కారణాలతో వాయిదా వేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని