ET: పంచె ఎగ్గడితే నేనే జడ్జి‌: సూర్య

‘నేను కోటు వేసుకుంటే అక్కడ జడ్జి వేరొకరు ఉంటారు. కానీ పంచె ఎగ్గడితే నేనేరా జడ్జి’’ అని అంటున్నారు నటుడు సూర్య. ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్‌’ వంటి క్లాస్‌ సినిమాల తర్వాత.. మరోసారి మాస్‌ కథతో ఎంటర్‌టైన్‌ చేయడానికి ఆయన సిద్ధమయ్యారు....

Published : 02 Mar 2022 13:33 IST

హైదరాబాద్‌: ‘‘నేను కోటు వేసుకుంటే అక్కడ జడ్జి వేరొకరు ఉంటారు. కానీ పంచె ఎగ్గడితే నేనేరా జడ్జి’’ అని అంటున్నారు నటుడు సూర్య. ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్‌’ వంటి క్లాస్‌ సినిమాల తర్వాత.. మరోసారి మాస్‌ కథతో ఎంటర్‌టైన్‌ చేయడానికి ఆయన సిద్ధమయ్యారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త యాక్షన్‌ చిత్రం ‘ఈటీ’. పాండిరాజ్‌ దర్శకుడు. అన్ని రకాల పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మార్చి 10న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ‘ఈటీ’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

‘‘వాడేమో సైంటిస్ట్‌ కావాలని ఆశ పడ్డాడు. నేనేమో వేరేలా చూడాలని ఆశపడ్డాను. కానీ, కాలం, దైవం వాడ్ని ఇలా చూడాలని ఆశపడింది’’ అనే సంభాషణలతో ప్రారంభమైన ఈ ట్రైలర్‌లో యాక్షన్‌ తరహా సన్నివేశాలు ఎక్కువగా చూపించారు. ఇందులో సూర్యకు జోడీగా ప్రియాంక అరుల్‌మోహన్‌ నటించారు. పాన్‌ ఇండియా మూవీగా ఇది విడుదల కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని