హైదరాబాద్‌లో సుశాంత్‌ అభిమానుల ఆందోళన

బాలీవుడ్‌ కథానాయకుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ ‌కు న్యాయం జరగాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌లోని పలువురు అభిమానులు ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌లో..

Updated : 08 Nov 2020 14:16 IST

హైదరాబాద్‌: బాలీవుడ్‌ కథానాయకుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌కు న్యాయం జరగాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌లోని పలువురు అభిమానులు ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌లో ఆందోళన చేపట్టారు. రాజ్‌పూత్‌ ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేశారని ఆరోపించారు. ఈ కేసులో సీబీఐ విచారణ జాప్యం జరుగుతుందని విమర్శించారు. సుశాంత్‌సింగ్‌ కేసులో నిజాలు వెలికి తీస్తున్న జర్నలిస్టు అర్నబ్‌ గోస్వామిని అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారని ఆరోపించారు. వెంటనే అక్రమ కేసులు ఎత్తివేసి అర్నబ్‌ను విడుదల చేయడంతో పాటు సుశాంత్‌ సింగ్‌ కేసులో న్యాయం గెలవాలంటూ నినదించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని