నెటిజన్‌పై తాప్సీ ఆగ్రహం

కరోనా సెకండ్‌వేవ్‌లో మందులు, ఆక్సిజన్‌ సిలిండర్లు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంతోమందికి సాయం చేయడం కోసం పలువురు సెలబ్రిటీలు ముందుకు వచ్చారు....

Published : 27 Apr 2021 01:02 IST

ముంబయి: కరోనా రెండో దశ విజృంభణలో మందులు, ఆక్సిజన్‌ సిలిండర్లు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంతోమందికి సాయం చేయడం కోసం పలువురు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. సాయం కోరిన వారికి సోషల్‌మీడియా వేదికగా అవసరమైన సమాచారాన్ని అందజేస్తూ తరచూ అందుబాటులో ఉంటున్నారు. ఈక్రమంలోనే బాలీవుడ్‌ నటి తాప్సీ ట్విటర్‌ వేదికగా ఆక్సిజన్‌ సిలిండర్లు, అవసరమైన మందులు ఎవరి వద్ద లభ్యమవుతాయో వాళ్ల సమాచారాన్ని నెట్టింట్లో పోస్ట్‌ చేస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్‌.. ‘ఇంట్లో కూర్చొని ట్వీట్లు చేసే బదులు అత్యంత ఖరీదైన నీ కారుని వాళ్లకు అందిస్తే ఏదో ఒకరకంగా ఉపయోగించుకుంటారు కదా’ అని ట్వీట్‌ చేశాడు.

కాగా, ఈ ట్వీట్‌పై తాప్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒకవేళ మీలాంటి వాళ్లు నాకు ఇదే చెప్పాలనుకుంటే.. దేశం మళ్లీ సాధారణంగా ఊపరి పీల్చుకునే స్థాయికి వెళ్లేవరకూ నోరు విప్పకండి. ఇలాంటి చెత్త మెస్సేజ్‌లతో నా టైమ్‌ని వృథా చేయకండి. నేను ఏం చేయాలనుకున్నానో అది చేయనివ్వండి’ అని తాప్సీ మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని