Taapsee: ప్రశ్నలు అడిగే ముందు హోంవర్క్ చేసుకురండి: జర్నలిస్ట్పై తాప్సీ రుసరుస
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించిన తాప్సీ (Taapsee) ప్రస్తుతం బాలీవుడ్లో వరుసగా సినిమాలు
ముంబయి: ఒకప్పుడు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించిన తాప్సీ (Taapsee) ప్రస్తుతం బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తోంది. అంతేకాదు, ముక్కుసూటిగా మాట్లాడటంలో ఆమెకు ఆమే సాటి. తాజాగా ఓ అవార్డు ఫంక్షన్లో పాల్గొన్న ఆమె విలేకరిపై మండి పడింది. ‘ప్రశ్నలు అడిగేటప్పుడు హోంవర్క్ చేసుకుని రాలేరా’ అని రుసరుసలాడింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ‘ఓటీటీ ప్లే అవార్డ్స్ 2022’ కార్యక్రమంలో పాల్గొన్న తాప్సీని విలేకరి పలు ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా ఇటీవల ఆమె నటించిన ‘దొబారా’ సినిమాపై వచ్చిన నెగెటివ్ టాక్ గురించి అడగ్గా, ‘నెగెటివ్ టాక్ బారిన పడని చిత్రమేదైనా ఉందా?’ అని ఎదురు ప్రశ్నించింది. ఇంతలోనే మరో ప్రశ్న అడిగేందుకు ప్రయత్నించగా, మధ్యలో కలగజేసుకుని, ‘ముందు నా ప్రశ్నకు సమాధానం చెబితే, మీకు నేను సమాధానం చెబుతా. చెప్పండి ఏ చిత్రానికి నెగెటివ్ టాక్ రాలేదు’ అని కాస్త గట్టిగానే ప్రశ్నించింది.
తాప్సీ అన్న మాటలకు విలేకరి స్పందిస్తూ విమర్శకులు కూడా మెచ్చుకోలేదు కదా? అని అనగా, ‘ఇలాంటి ప్రశ్నలు అడిగేటప్పుడు కాస్త హోంవర్క్ చేసుకుని రండి. పైగా మర్యాదలేకుండా మాట్లాడారని మమ్మల్ని(నటులు) అంటారు’ అని ఘాటుగా స్పందించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఆమె సరిగ్గానే స్పందించింది’ అని ఒక అభిమాని కామెంట్ చేయగా, ‘ఆమె ఎందుకు ఎప్పుడూ కోపంతో ఊగిపోతు ఉంటుంది’ అని మరొకరు కామెంట్ చేశారు. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా ‘దొబారా’ తెరకెక్కింది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు. ఇక ఓటీటీ ప్లే 2020 అవార్డుల్లో భాగంగా ‘హసీనా దిల్రుబా’ చిత్రానికిగానూ తాప్సీ ఉత్తమ కథానాయికగా అవార్డును సొంతం చేసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ