చావుని ఎగతాళి చేస్తున్నారు: తాప్సీ
నిరసనల్లో మృతి చెందిన అన్నదాతల గురించి హరియాణా వ్యవసాయ శాఖ మంత్రి జేపీ దలాల్ చేసిన వ్యాఖ్యలపై నటి తాప్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆకలి తీర్చే రైతుల జీవితాలను అపహ్యాసం చేస్తున్నారని ఆమె అన్నారు. అన్నదాతల నిరసనల్లో మృతి చెందిన....
మంత్రి కామెంట్పై నటి వ్యాఖ్యలు
ముంబయి: నిరసనల్లో మృతి చెందిన అన్నదాతలను ఉద్దేశించి హరియాణా వ్యవసాయ శాఖ మంత్రి జేపీ దలాల్ చేసిన వ్యాఖ్యలపై నటి తాప్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆకలి తీర్చే రైతుల జీవితాలను అపహ్యాసం చేస్తున్నారని ఆమె అన్నారు. అన్నదాతల నిరసనల్లో మృతి చెందిన 200 మంది రైతుల గురించి ఇటీవల దలాల్ మాట్లాడుతూ.. ‘‘ఇంట్లో ఉంటే మాత్రం వాళ్లు చనిపోకుండా ఉంటారా? కొన్ని లక్షల మంది జనాభాలో 200 మంది చనిపోరా? వాళ్లు తమ ఇష్టపూర్వకంగానే మృతిచెందారు’’ అని వ్యాఖ్యానించారు.
రైతుల మృతిపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా వివాదాస్పదమయ్యాయి. దీంతో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వ్యాఖ్యలపై నటి తాప్సీ తాజాగా స్పందిస్తూ.. ‘మనిషి జీవితానికి విలువపోయింది! మన ఆకలి తీరుస్తున్న రైతుల జీవితానికి విలువపోయింది! అన్నదాతల మరణాలను అపహాస్యం చేస్తున్నారు’ అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు, రైతుల గురించి తాను అన్న మాటలకు మంత్రి దలాల్ క్షమాపణలు కోరారు.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
క్షమాపణలు యాడ్ సైజ్లోనే ప్రచురించారా? పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!