నేరుగా ఓటీటీలోకి రష్మీ రాకెట్‌..!

తాప్సీ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా నటించిన చిత్రం ‘రష్మీ రాకెట్‌’. నేరుగా ఓటీటీలోనే విడుదల కానుందా..? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు అకర్ష్‌ ఖురానా దర్శకత్వం వహించారు. రోనీ స్వ్కువాల, నేహా, ప్రంజల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Published : 02 Jun 2021 01:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాప్సీ నటించిన మరో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం ‘రష్మీ రాకెట్‌’. ఈ చిత్రం నేరుగా ఓటీటీలోనే విడుదల కానుందా..? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు అకర్ష్‌ ఖురానా దర్శకత్వం వహించారు. రోనీ స్క్రూవాల, నేహా, ప్రంజల్‌ సంయుక్తంగా నిర్మించారు. కాగా.. ఈ సినిమా విడుదలపై బీటౌన్‌లో కొంతకాలంగా కాస్త ఆసక్తి నెలకొంది. కరోనా నేపథ్యంలో ఓటీటీలో విడుదల అవుతుందా.. లేక థియేటర్‌ విడుదల కోసం మరికొంత కాలం ఎదురుచూస్తుందా అని చర్చలు సాగాయి. అయితే.. ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. నిర్మాతలు ఇప్పటికే ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈమేరకు పలు ఓటీటీ వేదికలతో చర్చలు కూడా జరుపుతున్నారట. మరికొన్ని రోజులో అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.

ఈ చిత్రంలో గుజరాత్‌కు చెందిన అథ్లెట్‌ రష్మీగా తాప్సీ కనిపించనుంది. ఆ పాత్రలో ఒదిగిపోయేందుకు తాప్సీ కఠోరమైన సాధన చేసింది. అంతేకాదు ఆమె ప్రత్యేకంగా దుబాయ్‌లో శిక్షణ కూడా తీసుకుంది. ఈ సినిమా గురించి తాప్సీ ఒకసారి మాట్లాడుతూ.. ఈ చిత్రం కోసం తాను ఎంతో కష్టపడ్డానని, కథ విన్నప్పటి నుంచి ఎన్నో అవాంతరాలు దాటి చిత్రీకరణ పూర్తి చేశామని ఆమె చెప్పింది. ఇటీవల మహిళా ప్రధాన్యమున్న కథలు ఎంచుకొంటూ వస్తోంది తాప్సీ. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా చిత్రాలున్నాయి. భారత క్రికెటర్ మిథాలి రాజ్‌ బయోపిక్‌లోనూ ఆమె క్రికెటర్‌గా కనిపించనుంది. అది చిత్రీకరణ దశలో ఉంది. కాగా మరికొన్ని చిత్రాలు నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని