తమిళ సినిమాలు: వివాదాలు.. విశేషాలు
తమిళనాడులో ఫ్యామిలీ మ్యాన్ సెగ రగులుతోంది. ఈ వెబ్ సిరీస్ తమిళుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలతో పాటు, ప్రభుత్వం కూడా ఈ వెబ్ సిరీస్ను నిషేధించాలని కోరుతోంది. ఈ గొడవ వెనక కారణాలతో పాటు.. తమిళనాట రాజకీయ దుమారం రేపిన మరికొన్ని సినిమా వివాదాలేంటో చూద్దాం.
తమిళనాడులో రాజకీయ దుమారం రేపిన చిత్రాలు
తమిళనాడులో ‘ఫ్యామిలీ మ్యాన్’ సెగ రగులుతోంది. ఈ వెబ్ సిరీస్ తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలతో పాటు, ప్రభుత్వం కూడా ఈ వెబ్ సిరీస్ను నిషేధించాలని కోరుతోంది. ఈ వివాదం వెనక కారణాలతో పాటు.. తమిళనాట రాజకీయ దుమారం రేపిన మరికొన్ని సినిమా వివాదాలేంటో చూద్దాం!
విజయం.. వివాదం
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత విజయం సాధించిందో రెండో సీజన్ అంతగా వివాదంలో చిక్కుకుంది. ట్రైలర్లో శ్రీకాంత్ తివారీ ముంబయి నుంచి చెన్నై వెళ్లే వరకూ బాగానే ఉంది. ఎప్పుడైతే రాజీ పాత్రలో సమంత కనిపిస్తుందో అక్కడే వారికి అభ్యంతరాలు ఎదురయ్యాయి. తమ మనోభావాలు దెబ్బతినేలా ట్రైలర్ ఉందని వారి వాదన. శ్రీలంకలో తమ ఉనికి కోసం పోరాడుతున్న తమిళులను ఉగ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆగ్రహానికి గురయ్యారు. ఎల్టీటీఈకి ఉగ్రవాద సంస్థ ఐసీస్తో సంబంధమున్నట్లు చూపడంపై తమిళ వర్గాలు మండిపడుతున్నాయి. ఆ రాష్ట్ర ఐటీ శాఖమంత్రి మనో తంగరాజ్తో పాటు ఎండీఎంకే అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ వైగో.. రెండో సీజన్ను నిషేధించాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్కు బహిరంగ లేఖలు రాశారు.
తమిళ ప్రజల పట్ల ప్రేముంది
ట్రైలర్లో కొన్ని షాట్స్ చూసి, మొత్తం కథను అంచనా వేయొద్దని అంటున్నారు ఫ్యామిలీ మ్యాన్ సృష్టికర్తలు రాజ్, డీకే. తమ బృందంలో ఎక్కువమంది తమిళనాడుకు చెందినవారే ఉన్నారని చెప్పుకొచ్చారు. ‘తమిళ సంస్కృతి పట్ల అవగాహన ఉంది. వారంటే అపారమైన ప్రేమ, గౌరవం ఉంది. సున్నితమైన కథను అందించే ప్రయత్నం చేశాం. రెండో సీజన్ చూశాక కచ్చితంగా మా ప్రయత్నాన్ని మెచ్చుకుంటారు’ అని వారు చెబుతున్నారు. నిజానికి ఈ వెబ్ సిరీస్ గత డిసెంబర్లోనే విడుదలవ్వాల్సి ఉంది. ఆ తర్వాత ఫిబ్రవరి12 కి మారింది. ఇప్పుడు జూన్ 4న విడుదలకు సిద్ధమైంది. ఈ ఆలస్యం వెనక ఓ కారణం ఉంది. భారత్తో పాటు విదేశాల్లోనూ ఈ వెబ్ సిరీస్కు విపరీతమైన ఆదరణ దక్కింది. హిందీ, తమిళ్, తెలుగుతో పాటు విదేశీ భాషలతో కలుపుకొని మొత్తం 10 భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ డబ్బింగ్ పనుల వల్లే ఇంత ఆలస్యమైంది.
గతంలోని వివాదాలివి
కమల్ హాసన్ ‘విశ్వరూపం’(2013) శాంతి భద్రతలకు భంగం కలిగించేదిగా ఉందని అప్పటి జయలలిత ప్రభుత్వం ఆ సినిమాపై నిషేధం విధించింది. ఆ తర్వాత న్యాయస్థానంలో పోరాడటంతో చివరకు థియేటర్లలో విడుదలైంది. ఈ సమయంలోనే ‘నాకు ఇండియా వదిలి వెళ్లాలని ఉంది’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కమల్ హాసన్. అంతగా ఈ సినిమాపై రాజకీయ దుమారం రేగింది. సినిమా సూపర్ హిట్గా నిలిచింది.
* సినిమాటోగ్రాఫర్ సంతోశ్ శివన్ దర్శకుడిగా తెరకెక్కించిన ‘ఇనామ్’ (2013)ను విడుదలైన కొన్ని రోజులకే థియేటర్ల నుంచి తొలగించారు. శ్రీలంకలో అంతర్యుద్ధం కారణంగా అనాథలైన చిన్నారుల జీవితాలను కథాంశంగా ఎంచుకోవడమే ఈ చిత్ర వివాదానికి ప్రధాన కారణం. సింహళీయులకు అనుకూలంగా ఉందని రాజకీయ పార్టీలు ఆగ్రహించాయి.
* విజయ్-అట్లీ కాంబినేషన్లో వచ్చిన ‘మెర్సల్’(2017)లో కేంద్ర ప్రభుత్వ విధానాలైన జీఎస్టీ, డిజిటల్ ఇండియాపై అభ్యంతరకర డైలాగ్స్ ఉన్నాయని, హిందువుల మనోభావాలను గాయపరిచేలా ఉందని వివాదం చెలరేగింది. ఈ వివాదాలు మెర్సల్కు మరింత ప్రచారం తీసుకొచ్చి బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించింది.
* అలాగే విజయ్ మరో చిత్రం ‘సర్కార్’కి ఇలాంటి రగడే జరిగింది. ఇందులో ప్రతినాయిక పేరు కోమలవల్లి. దివంగత మాజీ సీఎం జయలలిత అసలు పేరు కోమలవల్లి కావడమే ఈ గొడవకు కారణం. అప్పుడు అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వం దర్శకుడు మురుగుదాస్ ఇంటికి వెళ్లి సోదాలు చేయడం చర్చనీయాంశమైంది.
* జాన్ అబ్రహం తను హీరోగా నటించి, నిర్మించిన ‘మద్రాస్ కేఫ్’ సినిమాను తమిళనాడులోని రాజకీయ పార్టీలు అడ్డుకునే ప్రయత్నం చేశాయి.
* వివాదాలకు ఆమడ దూరంలో ఉండే విజయ్ సేతుపతికీ తప్పలేదు ఈ సెగ. శ్రీలంక వెటరన్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్లో నటించడానికి అంగీకరించడాన్ని అక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. శ్రీలంకలో తమిళులపై అరాచకాలు జరుగుతున్నప్పుడు నోరుమెదపని మురళీధరన్ పాత్రను ఎలా పోషిస్తావని మండిపడ్డారు. అక్కడి రాజకీయ ఒత్తిడికి విజయ్ సేతుపతి తలొగ్గక తప్పలేదు. అలా ‘800’ చిత్రం మొదలవకుండానే ఆగిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్