‘సొగసు చూడ తరమా’ ఫస్ట్‌లుక్

‘సొగసు చూడ తరమా’ ఫస్ట్‌లుక్‌ను మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేయటం సంతోషంగా ఉందని ప్రముఖ నటుడు, రచయిత

Updated : 08 Mar 2021 17:05 IST

హైదరాబాద్‌: ‘సొగసు చూడ తరమా’ ఫస్ట్‌లుక్‌ను మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేయటం సంతోషంగా ఉందని ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి అన్నారు. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, క్రియేటివ్ థింక్స్‌ గ్యాంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. తల్లాడ సాయి కృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నక్షత్ర కథానాయికగా నటిస్తోంది.

ఈ సందర్భంగా తనికెళ్ల భరణి  మాట్లాడుతూ.. ‘‘కంటెంట్ ఉన్న ఏ సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆరేళ్ల నుంచి సాయికృష్ణ, అతని టీమ్‌ను చూస్తున్నా. సినిమా కోసం వాళ్లు పడే తపన చూస్తుంటే ముచ్చటేస్తోంది. టైటిల్ వింటుంటే ఒక మంచి లవ్ స్టోరీలా అనిపిస్తోంది. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు’’ అని అన్నారు.

దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ.. ‘‘సొగసు చూడ తరమా’ ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన తనికెళ్ల భరణిగారికి ధన్యవాదములు. ఇది ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ. అరకులో జరిగే అందమైన కథ.  దీనికి హాస్యాన్ని జోడిస్తూ చక్కని సందేశాన్నిచ్చేలా తీర్చిదిద్దాం. మహిళా దినోత్సవం రోజున ఆడవాళ్లను సన్మానిస్తే సరిపోదు. రోజూ వారిని గౌరవించాలి’ అని అన్నారు. ఈ సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని కథానాయిక నక్షత్ర అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం వివేకానంద విక్రాంత్, అను ,విజయ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. వి.ఆర్‌.ఎ. ప్రదీప్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రానికి శివ రాథోడ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు