షూటింగ్‌లో గాయపడిన విజయ్‌ దేవరకొండ- సమంత.. ‘ఖుషి’ టీమ్‌ ఏం చెప్పిందంటే?

విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda), సమంత(Samantha) కీలక పాత్రల్లో శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఖుషి’.

Published : 24 May 2022 16:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda), సమంత(Samantha) కీలక పాత్రల్లో శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఖుషి’. కశ్మీర్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతుండగా, విజయ్‌, సామ్‌ గాయపడ్డారంటూ పలు వార్తలు వచ్చాయి. సెట్‌లో ప్రమాదం జరగడంతో వీరిద్దరూ గాయపడ్డారంటూ సామాజిక మాధ్యమాల వేదికగా న్యూస్‌ చక్కర్లు కొట్టింది. ఇలాంటి వార్తలకు చెక్‌ పెడుతూ ఈ చిత్ర బృందం ఓ ఫొటోను పంచుకుంది. దర్శకుడు శివ నిర్వాణకు అటూ ఇటూ వెన్నెల కిషోర్‌, విజయ్‌ దేవరకొండ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ఈ ఫొటోను సమంత తీయడం విశేషం.

‘‘విజయ్‌, సామ్‌ గాయపడ్డారని వస్తున్న వార్తల్లో నిజం లేదు. కశ్మీర్‌లో 30 రోజుల పాటు విజయవంతంగా షూటింగ్‌ పూర్తి చేసుకుని చిత్ర బృందం హైదరాబాద్‌కు తిరిగి వచ్చింది’’ అని ఖుషి టీమ్‌ తెలిపింది.  రొమాంటిక్‌ యాక్షన్‌ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను డిసెంబరు 23న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని