సినిమా చూసి కంటతడి పెట్టుకున్నా: మోహన్బాబు
‘మోసగాళ్లు’లో కొన్ని సన్నివేశాలు చూసి కంటతడి పెట్టుకున్నానని అన్నారు మోహన్బాబు అన్నారు. ఇలాంటి కథ మునుపెన్నడూ రాలేదని, ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ చిత్రం చూడాలని చెప్పారు. మంచు విష్ణు, కాజల్ ప్రధాన......
ఇంటర్నెట్ డెస్క్: ‘మోసగాళ్లు’లో కొన్ని సన్నివేశాలు చూసి కంటతడి పెట్టుకున్నానని అన్నారు మోహన్బాబు అన్నారు. ఇలాంటి కథ మునుపెన్నడూ రాలేదని, ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ చిత్రం చూడాలని చెప్పారు. మంచు విష్ణు, కాజల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చన్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ స్టార్ సునీల్శెట్టి కీలక పాత్ర పోషించారు. మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సోమవారం ప్రిరిలీజ్ వేడుక ఏర్పాటు చేసింది. ఈ వేడుకలో పాల్గొని మోహన్బాబు మాట్లాడారు. ‘‘సాధారణంగా నేను ఇంగ్లిష్ మాట్లాడను. ఎందుకంటే నా మాతృభాష తెలుగు. కానీ సునీల్శెట్టి కోసం మాట్లాడుతున్నాను. ఆయన ఒక గొప్ప నటులు. ఆయనతో పనిచేసే అవకాశం రావడం గొప్ప విషయం. ఇక కాజల్ గురించి చెప్పాలంటే.. ఆమె నా కూతురులాంటిది. ఒక పెద్ద హీరోయిన్ అయ్యుండి కూడా హీరోకి సోదరి పాత్ర చేసేందుకు ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం. ఒకవేళ నేనే కాజల్ స్థానంలో ఉంటే ఈ సినిమాకు ఒప్పుకోకపోయి ఉండేవాడిని. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. భారతదేశంలో ఇలాంటి కథ నాకు తెలిసి ఇంతవరకు ఎప్పుడూ రాలేదు. ఈ సినిమా కోసం ఎంతో రీసెర్చ్ చేశారు. కాజల్-విష్ణు మధ్య సన్నివేశాలు కంటతడి పెట్టించాయి. సినిమాకు అందరూ ఎంతో కష్టపడి పనిచేశారు. మార్చి 19న థియేటర్లలో సినిమాను అందరూ చూడాలని కోరుకుంటున్నా’’ అని ఆయన అన్నారు.
విష్ణు మాట్లాడుతూ.. ‘‘అడిగిన వెంటనే ఒప్పుకోవడం సునీల్శెట్టి గొప్పతనం. నేను జిమ్ చేసింది మొత్తం.. ఫైట్ సీన్లలో ఆయన చేతిలో దెబ్బలు తినడానికే సరిపోయింది. ఇకపోతే హీరోయిన్.. స్టోరీ చెప్పగానే కాజల్ ఈ సినిమాలో చేయడానికి ఒప్పుకుంది. అంతపెద్ద స్టార్ హీరోయిన్ అసలు సోదరి పాత్ర చేయడమే ఎక్కువ. చెల్లి అంటే ఆలోచించవచ్చు. కానీ.. హీరోకి అక్క పాత్ర అంటే ఎవరూ సాహసించరు. కానీ కాజల్ చేసింది. ఆమెకు కథ నచ్చడమే ఇందుకు కారణం. మీకు కూడా సినిమా నచ్చుతుంది’’ అని విష్ణు అన్నారు. అంతకుముందు కాజల్ మాట్లాడుతూ.. ‘‘నా పెళ్లి తర్వాత వస్తున్న మొదటి సినిమా ఇది. సినిమా కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నాను. 2020లోనే విడుదల కావాల్సి ఉన్నా కరోనా వల్ల అది కుదరలేదు. అందరం దాదాపు సంవత్సరం పాటు థియేటర్లకు దూరమయ్యాం. ఇప్పుడు మళ్లీ మనకు అవకాశం వచ్చింది. అందరూ థియేటర్కు వెళ్లి ‘మోసగాళ్లు’ సినిమా చూడాలి’’ అని ఆమె కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్పై దర్శకుడు ప్రశాంత్వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు. -
10 వేల పదాలతో విజయ్పై కవిత.. అవార్డు దక్కించుకున్న అభిమాని
తమిళ స్టార్ హీరో విజయ్పై ఓ అభిమాని వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. -
రజనీకాంత్- లోకేశ్ కాంబో టైటిల్ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?
రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. అదేంటంటే? -
చిరు ‘విశ్వంభర’.. హైలైట్ షెడ్యూల్ పూర్తి!
చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో ఇంటర్వెల్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయి. దీని షెడ్యూల్ను పూర్తి చేసినట్లు సమాచారం. -
ఈ వారం థియేటర్లో ఆసక్తికర మూవీస్.. ఓటీటీలో డబుల్ ఫన్..
ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్కు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, సిరీస్లు సిద్ధమయ్యాయి. -
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్.. అమితాబ్ బచ్చన్ పాత్ర ఇదే!
‘కల్కి 2898 ఏడీ’లోని అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. -
25 రోజుల్లో రూ.150 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ‘ఆడు జీవితం’
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. -
‘శబరి’ చేయడానికి ఆమె ప్రధాన కారణం: నిర్మాత మహేంద్రనాథ్
‘శబరి’ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకురానున్న సందర్భంగా నిర్మాత మీడియాతో ముచ్చటించారు. -
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
రాజమౌళి - మహేశ్ ప్రాజెక్ట్పై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని నిర్మాత గోపాల్రెడ్డి కోరారు. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
ప్రశాంత్ వర్మ (Prasanth varma) - తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ (Jai hanuman) రానున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుండటంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు. -
మహేశ్-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?
మహేశ్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. -
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్..
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో భాగమైనట్లు చిత్రబృందం తెలిపింది. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?
ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలో అలరించే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న