Tees Maar Khan: అందరూ మెచ్చే ‘తీస్‌ మార్‌ ఖాన్‌’

ఆది సాయికుమార్‌ హీరోగా కల్యాణ్‌ జి.గోగణ తెరకెక్కించిన యాక్షన్‌ చిత్రం ‘తీస్‌ మార్‌ ఖాన్‌’. నాగం తిరుపతి రెడ్డి నిర్మాత. పాయల్‌ రాజ్‌పూత్‌ కథానాయిక.

Updated : 15 Aug 2022 16:06 IST

ఆది సాయికుమార్‌ (Aadi) హీరోగా కల్యాణ్‌ జి.గోగణ తెరకెక్కించిన యాక్షన్‌ చిత్రం ‘తీస్‌ మార్‌ ఖాన్‌’ (Tees Maar Khan). నాగం తిరుపతి రెడ్డి నిర్మాత. పాయల్‌ రాజ్‌పూత్‌ కథానాయిక. ఈ సినిమా ఆగస్టు 19న   విడుదల కానుంది. ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో ఆది మాట్లాడుతూ.. ‘‘ఈ మధ్య నేను థ్రిల్లర్‌ చిత్రాలు చేశా. కామెడీ ఎంటర్‌టైనర్లు చేశా. కానీ, పక్కా కమర్షియల్‌ సినిమా చేయలేదు. ఆలోటు ఈ చిత్రంతో తీరింది. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు నిర్మాత. ఈనెల 19న విడుదలవుతున్న మా చిత్రాన్నీ ప్రేక్షకులు ఆదరించి, ఆశీర్వదించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘బలమైన కథను, వాణిజ్యాంశాలను మిక్స్‌ చేసి తీసిన చిత్రమిది. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు దర్శకుడు కల్యాణ్‌. చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సాయి కార్తీక్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ఆర్జే హేమంత్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని