TeluguCinema: తేజ- శివానీ.. ‘అద్భుతం’

తేజ సజ్జ, శివానీ రాజశేఖర్‌ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. మల్లిక్‌ రామ్‌ దర్శకుడు. ప్రశాంత్‌ వర్మ కథ అందిస్తున్నారు.

Published : 01 Jul 2021 21:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తేజ సజ్జ, శివానీ రాజశేఖర్‌ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. మల్లిక్‌ రామ్‌ దర్శకుడు. ప్రశాంత్‌ వర్మ కథ అందిస్తున్నారు. గురువారం నాయిక శివానీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకి శుభాకాంక్షలు తెలియజేసి, టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు నటుడు నాని. ఈ పోస్టర్‌లో.. నాయకానాయికలు ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్టు కనిపించారు. సమయం కోసం ఇద్దరూ తమ చేతికున్న వాచీని చూస్తుంటారు. ఈ చిత్రానికి ‘అద్భుతం’ అనే పేరు ఖరారైంది. మరి వీళ్ల మధ్య జరిగిన ఆ అద్భుతం ఏంటో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. చంద్రశేఖర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకి రథన్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నటులు జీవిత, రాజశేఖర్‌ దంపతుల తనయ ఈ శివానీ. ఈ చిత్రంతోపాటు ‘డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ’లోనూ నటిస్తోందామె. గుహన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అదిత్‌ అరుణ్‌ హీరోగా నటిస్తున్నాడు.  

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని