Tejashwini: ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో సెగలు పుట్టించిన తేజస్విని డ్యాన్స్‌

Sridevi Drama Company: ఈ వారం డ్యాన్సర్‌ తేజస్వినీ, సింగర్స్‌ స్ఫూర్తి, మౌనిక, శిరీషలు తమ ప్రదర్శనతో వీక్షకులను అలరించారు

Updated : 29 Aug 2021 19:49 IST

హైదరాబాద్‌: సరదా సరదా సంభాషణలతో, అదిరిపోయే పెర్ఫామెన్స్‌లతో ఆదివారం బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంటుంది ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. ఈ ఆదివారం మరింత అందంగా యువ ప్రేక్షకులకు సెగలు పుట్టించింది తేజస్విని డ్యాన్స్‌ ఫెర్మామెన్స్‌. సునీల్‌ మాస్టర్‌ నృత్యాలు సమకూర్చగా, ‘మధురమే ఈ క్షణమే.. ఓ చెలి’, ‘పరేషాను రా’, ‘ఊరికే ఉడికిస్తావే’ తదితర పాటలతో తేజస్విని వేసిన స్టెప్‌లు ఉర్రూతలూగించాయి. కార్యక్రమానికి హాజరైన వారితో పాటు, నటి ఇంద్రజ, రాగిణి, వ్యాఖ్యాత సుధీర్‌ తేజస్వినీ స్టెప్‌లకు ఊగిపోయారు.

ఇక ‘సై టీమ్‌’ సింగర్స్‌  స్ఫూర్తి, మౌనిక, శిరీషలు తమ పాటలతో మెస్మరైజ్‌ చేశారు. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’సభ్యులైతే వారితో కలిసి చిందులు వేశారు. అలరించేలా సాగిన ఈ రెండు పెర్ఫామెన్స్‌లను మీరూ చూసేయండి.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని