Allu arjun: ‘అల వైకుంఠపురములో’ సీక్వెల్తో వస్తారా? కొత్త కథ?
గతేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’.
ఇంటర్నెట్డెస్క్: గతేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. అల్లు అర్జున్ స్టైలిష్ నటన, త్రివిక్రమ్ టేకింగ్, పూజా హెగ్డే అందాలతో పాటు, తమన్ అందించిన పాటలు సినిమాలను మరో స్థాయిలో నిలిపాయి. బన్నీ కెరీర్లో ఇప్పటివరకూ ఆల్టైమ్ సూపర్హిట్ చిత్రంగా నిలిచింది. ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగా అల్లు అర్జున్తో మరో సినిమా చేస్తానని త్రివిక్రమ్ అప్పట్లోనే ప్రకటించారు. కాగా, ఆ మాట నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
నాగశౌర్య కథానాయకుడిగా నటించిన ‘వరుడు కావలెను’ చిత్ర ప్రచార కార్యక్రమంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరితో పాటు తమన్తో కలిసి దిగిన ఫొటోను నిర్మాత నాగ వంశీ పంచుకున్నారు. ‘త్వరలోనే సర్ప్రైజ్ రానుంది’ అంటూ హారిక హాసిని ట్విటర్ను ట్యాగ్ చేశారు. దీంతో అల్లు అర్జున్-త్రివిక్రమ్-తమన్ కాంబినేషన్లో మరో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని టాలీవుడ్లో టాక్ మొదలైంది. అది ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి సీక్వెల్గా తీస్తారా? కొత్త కథతో ముందుకు వస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.
‘అల వైకుంఠపురములో’ బంటు(అల్లు అర్జున్) ఇంటికి రాజ్ మనోహర్(సుశాంత్).. రాజ్ మనోహర్ ఇంటికి బంటు వెళతారు(అవే వాళ్ల అసలైన తల్లిదండ్రుల ఇళ్లు). ఆ తర్వాత కథ ఎలా ఉంటుంది? బంటు బిజినెస్లోకి మళ్లీ అప్పలనాయుడు(సముద్రఖని), అతడి కొడుకు పైడితల్లి(గోవింద్) వచ్చారా? వస్తే బంటు ఎలా ఎదుర్కొన్నాడు? ఇలా కథను ముందుకు నడిపించే అవకాశమూ లేకపోలేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. మొదటి భాగం డిసెంబరులో విడుదల కానుంది. ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’ కోసం పనిచేస్తున్నారు. మరోవైపు మహేశ్బాబుతో చేయబోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లోనూ బిజీగా ఉన్నారు. మరి వీరి కాంబినేషన్లో చిత్రం ఎప్పుడు మొదలవుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఈ వార్తే నిజమైతే బన్ని అభిమానులకు పండగే పండగ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు. -
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
వాళ్లతో గొడవ పడటం మంచిది కాదు: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. చైనీస్, జపనీస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. -
రజనీకాంత్- లోకేశ్ కాంబో టైటిల్ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?
రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. అదేంటంటే? -
నాకు కారు లేదు.. అమ్మేశా : విశాల్
‘రత్నం’ (Rathnam) రిలీజ్లో భాగంగా తాజాగా ఓ కాలేజీలో జరిగిన ఈవెంట్లో నటుడు విశాల్ (Vishal) పాల్గొన్నారు. గత కొన్ని రోజుల నుంచి తనని ఉద్దేశించి వస్తోన్న వార్తలపై ఆయన స్పందించారు. -
‘కల్కి’లో మరో ఇద్దరు టాలీవుడ్ హీరోలు!.. వైరలవుతోన్న వార్త
‘కల్కి’కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమవుతోంది. ఇందులో పలువురు యంగ్ నటీనటులు భాగం కానున్నట్లు తెలుస్తోంది. -
లక్కీ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. ఆ స్టార్ హీరోకు జోడీగా..?
గతేడాది వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు నటి శ్రీలీల (Sreeleela). కెరీర్ పరంగా ప్రస్తుతం కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ భామకు తాజాగా క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. -
డబ్బు కోసమే సల్మాన్ సోదరిని పెళ్లి చేసుకున్నానన్నారు: ఆయుష్ శర్మ
బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ఖాన్ బామ్మర్దిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటుడు ఆయుశ్ శర్మ. ఆయన హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘రుస్లాన్’. దీని ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. -
చిరు ‘విశ్వంభర’.. హైలైట్ షెడ్యూల్ పూర్తి!
చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో ఇంటర్వెల్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయి. దీని షెడ్యూల్ను పూర్తి చేసినట్లు సమాచారం. -
ఈ క్షణాలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటా: ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ
‘హనుమాన్’ (Hanuman) విజయంపై మరోసారి స్పందించారు చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth varma). ఈ సినిమా విడుదలై వందరోజులు దాటిన సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. -
క్రమశిక్షణలో ఎన్టీఆర్ కాఠిన్యం!
షూటింగ్ జరుగుతున్న రోజుల్లో, కె.ఆర్.విజయ సెట్టుకి ఆలస్యంగా రావడమే కాకుండా, సమాచారం లేకుండా రెండు రోజులు షూటింగ్కు రాలేదు. -
రామ్చరణ్ అంటే నాకెంతో ఇష్టం..: బాలీవుడ్ నటి
నటుడు రామ్చరణ్ అంటే తనకెంతో ఇష్టమన్నారు బాలీవుడ్ నటి మానుషి చిల్లర్. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని తెలిపారు. -
దావుద్ పార్టీలో డ్యాన్స్.. అక్షయ్కుమార్ సతీమణి ఏమన్నారంటే..?
అండర్ వరల్డ్ డాన్, ముంబయి పేలుళ్ల సూత్రధారి దావుద్ ఇబ్రహీం(Dawood Ibrahim) కోసం అక్షయ్ కుమార్ సతీమణి, నటి ట్వింకిల్ ఖన్నా డ్యాన్సులు చేసినట్లు దాదాపు పదేళ్ల క్రితం వార్తలు వచ్చాయి. ఆయా కథనాలపై తాజాగా ఆమె స్పందించారు. -
ఈ వారం థియేటర్లో ఆసక్తికర మూవీస్.. ఓటీటీలో డబుల్ ఫన్..
ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్కు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, సిరీస్లు సిద్ధమయ్యాయి. -
‘టైగర్’తో సవాల్ ఎదుర్కొన్నా
‘‘ప్రేక్షకుల మనసుల్ని హత్తుకునేలా ఒక పాత్రకు సంబంధించిన భావోద్వేగాలను గళంలో వినిపించడం ఎంతో సవాలుతో కూడిన పని’’ అంటోంది కథానాయిక ప్రియాంక చోప్రా. హాలీవుడ్, బాలీవుడ్లో తన నటనా ప్రతిభను నిరూపించుకున్న ఈమె.. -
పద్దెనిమిదేళ్ల తర్వాత జోడీగా..
ఆఫ్స్క్రీన్, ఆన్స్క్రీన్లో హిట్ జోడీ అయిన సూర్య, జ్యోతిక తమిళంలో ‘పూవెల్లం కేట్టుప్పార్’ మొదలుకొని ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించి, మెప్పించారు. -
రజనీ చిత్రంలో నాగ్?
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీ 171వ సినిమా ఇది. సోమవారం పేరుని ప్రకటిస్తున్నారు. -
అశ్వత్థామగా అమితాబ్
‘‘ద్వాపర యుగం నుంచి దశావతారం కోసం ఎదురు చూస్తున్నాను. ద్రోణాచార్య తనయుడిని’’ అంటూ అశ్వత్థామ పాత్రలో పరిచయం అయ్యారు అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్. -
ఆ కళే.. నాకు థెరపీలాంటిది!
అందం.. నటనే కాదు.. అలవోకగా చిత్రాలు గీయగల సృజనశీలి నభా నటేశ్. తనకు మానసిక ప్రశాంతతనిచ్చేవి ఈ పెయింటింగ్సే అంటోందామె. -
యానిమల్ పార్క్ 2026లో..
‘యానిమల్’ సంచలన విజయంతో యావత్తు సినీ పరిశ్రమ దృష్టిని తనవైపునకు తిప్పుకున్నారు దర్శకుడు సందీప్రెడ్డి వంగా. బాక్సాఫీసు రికార్డు వసూళ్లతోపాటు విమర్శలూ ఎదుర్కొందీ చిత్రం. -
మూర్తి కలల ప్రయాణం
అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. శివ పాలడుగు దర్శకత్వం వహించారు. హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మాతలు.
తాజా వార్తలు (Latest News)
-
ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం.. వెంకయ్యనాయుడుకు ‘పద్మవిభూషణ్’ ప్రదానం
-
‘ఇలాంటి సీఎంను చూసి గర్విస్తున్నా’.. యోగిపై ప్రధాని ప్రశంసలు
-
Kolkata vs Bengaluru: టీవీ అంపైర్ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం.. విరాట్ కోహ్లీకి జరిమానా
-
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
-
రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభంలో స్వల్ప క్షీణత.. ఆదాయం 11 శాతం జంప్
-
కేజ్రీవాల్ ఆరోగ్యం.. మెడికల్ బోర్డు ఏర్పాటుకు కోర్టు ఆదేశం