Twins: అది ఇది కాదు- అదే ఇది.. సుధీర్‌, ఆది ట్విన్స్‌ని చూశారా!

‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ లేటెస్ట్‌ ప్రోమో విడుదలైంది. ఈ వారం ట్విన్స్‌తో సందడి చేయనుంది.

Updated : 17 Aug 2022 10:37 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వినోదంతోపాటు కొత్త ప్రతిభని పరిచయం చేసే బుల్లితెర కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. సుధీర్ వ్యాఖ్యాతగా ప్రతి ఆదివారం ఈటీవీలో ప్రసారమై, ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తోంది. రొటీన్‌కి భిన్నంగా తదుపరి ఎపిసోడ్‌ ప్రత్యేకంగా నిలవనుంది. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో కవలల జంటలు ఈ వేదికపై సందడి చేయనున్నాయి. ప్రపంచానికి తమ టాలెంట్‌ని చూపించనున్నాయి. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఆ విశేషాలివీ..

‘ట్విన్స్‌ స్పెషల్‌’.. ‘అది ఇది కాదు.. అదే ఇది’ పేరుతో ఈ ఎపిసోడ్‌ని రూపొందించారు. వీడియో ప్రారంభంలోనే కవలల జంటల్ని ఒకే ఫ్రేమ్‌లో చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. ఒకే వేదికపై అంతమంది కవలల్ని చూస్తే వావ్ అనాల్సిందే. వారిలో కొంతమంది ఓ స్కిట్‌తో కామెడీ పంచారు. కొందరు పాటలు ఆలపించి, మరికొందరు డ్యాన్సు చేసి అలరించారు. మధ్యలో ‘డియర్‌ మేఘ’ చిత్ర ప్రచారంలో భాగంగా నటులు అదిత్‌ అరుణ్, మేఘా ఆకాశ్‌ ఈ షోకి విచ్చేశారు. సినిమా కబుర్లు తెలిపారు. చివర్లో స్పెషల్‌ సర్‌ప్రైజ్ అంటూ సుధీర్‌, ఆది ట్విన్స్‌ దర్శనమిచ్చారు. వారిని చూడాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం.. ఈ ప్రోమో చూసేయండి. పూర్తి కార్యక్రమం చూడాలంటే సెప్టెంబరు 12 వరకు ఆగాల్సిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని