Cinema News: తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోం
‘‘సినిమాల్ని, సినీ పరిశ్రమకి చెందిన వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకుని సామాజిక అనుసంధాన వేదికల్లో తప్పుడు ప్రచారం సృష్టిస్తున్నారు. ఇకపైన అలాంటి వ్యాఖ్యలు ప్రచారం చేసేవాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అన్నారు
తెలుగు చలన చిత్ర పరిశ్రమ
‘‘సినిమాల్ని, సినీ పరిశ్రమకి చెందిన వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకుని సామాజిక అనుసంధాన వేదికల్లో తప్పుడు ప్రచారం సృష్టిస్తున్నారు. ఇకపైన అలాంటి వ్యాఖ్యలు ప్రచారం చేసేవాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అన్నారు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ. సామాజిక అనుసంధాన వేదికల్లో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ గురువారం హైదరాబాద్లోని చలన చిత్ర వాణిజ్య మండలి కార్యాలయంలో పరిశ్రమకి చెందిన అన్ని విభాగాల ప్రతినిధులు విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు జి.ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ ‘‘సామాజిక అనుసంధాన వేదికల్లో సినిమాలకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఇటీవల పరిపాటిగా మారింది. ఇండియన్ సెన్సార్షిప్ చట్టంతో కానీ, సినిమాటోగ్రఫీ సెన్సార్ చట్టంతోకానీ సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఓటీటీ వేదికల్లో కంటెంట్ని ప్రదర్శిస్తున్నారు. ఓటీటీ తరహాలోనే సామాజిక అనుసంధాన వేదికలూ మారాయి. పైరసీ నియంత్రణ విభాగం చలన చిత్ర వాణిజ్య మండలి ఆధీనం నుంచి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింద’’ని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్లు అనుకున్నవి, ఊహించినవి సామాజిక అనుసంధాన వేదికల్లో ప్రచారం చేస్తున్నారు. వీటిపై నియంత్రణ అవసరం. దీనిపై ఏం చేయాలో మేం ఓ నిర్ణయానికొచ్చాం’’ అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ. యూట్యూబ్కీ సెన్సార్ విధానం తీసుకురావాలని చెప్పారు దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్. ‘‘కొన్ని యూ ట్యూబ్ ఛానళ్లు మా కుటుంబంపై వ్యతిరేకమైన ప్రచారం చేశాయి. అవి మా జీవితాల్ని ప్రభావితం చేస్తున్నాయి’’ అన్నారు జీవిత రాజశేఖర్. ఈ సమావేశంలో పాల్గొనడం గురించి టి.ప్రసన్నకుమార్కీ, నిర్మాత శేఖర్గౌడ్కీ మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు ఎన్.శంకర్, వి.ఎన్.ఆదిత్య, టి.ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల, మాదాల రవి, మధుసూదన్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనసంతా.. ఫాంటసీ
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు.. -
‘విక్రమార్కుడు2’ కోసం కథ సిద్ధమైంది
‘‘తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’ చిత్రాల కోసం కథ సిద్ధమైంది. నటుల ఎంపిక పూర్తవ్వగానే సినిమాని పట్టాలెక్కిస్తాం’’ -
గురుశిష్యులుగా తండ్రీకూతుళ్లు?
సినిమాల్లో నటనతో మెప్పించే కథానాయకులు.. వారి వారసులను తెరపైకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అనే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. -
ఈ వేసవిలో... ‘మనమే’
‘చాలా మంచోడిగా కనిపిస్తా, కానీ మంచోడినా? కాదు’ అని చెప్పుకునే ఓ అబ్బాయి. ‘ఒకరికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే మన క్యారెక్టర్’ అని నమ్మే ఓ అమ్మాయి. -
నిర్ణయించుకో.. నిన్నెవరు పాలించాలో!
‘రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే... మీ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయి సర్?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు ఓ పాత్రికేయుడు. మరి సదరు నాయకుడి సమాధానం ఏమిటో తెలియాలంటే ‘ప్రతినిధి2’ చూడాల్సిందే. -
రెట్టింపు నవ్వులతో... ‘మ్యాడ్ స్క్వేర్’
‘టిల్లు స్క్వేర్’తో విజయాన్ని సొంతం చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ... మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించింది. -
బేబి కీర్తి.. సెట్లో సందడి
ఇతర భాషల్లో నటించి మంచి క్రేజ్ని సొంతం చేసుకున్న నాయకానాయికలు ఎందరో. ఇప్పుడదే జాబితలో చేరింది అందాల కథానాయిక కీర్తి సురేశ్. ‘బేబి జాన్’తో ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. -
‘బాక్’.. వారం వెనక్కి
సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్’. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan).