Akhanda: కొవిడ్ వచ్చినా.. దేవుడే దిగి వచ్చినా తెలుగు సినిమా.. ప్రేక్షకుడు ‘తగ్గేదేలే’
తెలుగు ప్రేక్షకులు సినిమాను ప్రేమించినంతగా మరే ప్రేక్షకుడు సినిమాను ప్రేమించడని అలాంటి మీ ప్రేమాభిమానాలు తమకు ఉన్నాయని కథానాయకుడు అల్లు అర్జున్ అన్నారు.
హైదరాబాద్: తెలుగు ప్రేక్షకులు సినిమాను ప్రేమించినంతగా మరే ప్రేక్షకుడు సినిమాను ప్రేమించడని, అలాంటి మీ ప్రేమాభిమానాలు తమకు ఉన్నాయని కథానాయకుడు అల్లు అర్జున్ అన్నారు. కొవిడ్ వచ్చినా, పైనుంచి దేవుడు దిగి వచ్చినా తెలుగు సినిమా, తెలుగు ప్రేక్షకులు తగ్గేదేలే అంటూ తనదైన శైలిలో అలరించారు. బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అఖండ’. బోయపాటి శ్రీను దర్శకుడు. ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు.
ఈ సందర్భంగా కథానాయకుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘తల్లిదండ్రులను దేవుళ్లకంటే ఎక్కువ ప్రేమతో చూసుకోవాలి. మీరు ఎవరిని ప్రేమిస్తారు అని అడిగితే నా నోటి నుంచి వచ్చే మొదటి పేరు మా నాన్నగారిది. ఆ తర్వాత అన్నీ నాకు అభిమానులే. ఏమీ ఆశించకుండా నన్ను ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి అభిమానులను పొందడం మా పూర్వ జన్మ సుకృతం. కొవిడ్ కష్టకాలాన్ని కూడా ఎదురొడ్డి ఎంతో మంది సినిమాను తెరకెక్కించారు. అలాంటి వారిని ప్రోత్సహించాలంటే ప్రతి సినిమాకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించాలి. రాబోయే రోజుల్లో వచ్చే ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’సహా ప్రతి చిత్రమూ మంచి విజయం సాధించాలి’’ అని బాలకృష్ణ అన్నారు.
రీల్లోనూ రియల్గానూ బాలకృష్ణ ఒకేలా ఉంటారు: అల్లు అర్జున్
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘‘నందమూరి కుటుంబానికి, అల్లు వారి కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. మా తాతయ్య అల్లు రామలింగయ్యగారంటే స్వర్గీయ ఎన్టీఆర్కు ఎంతో ఇష్టం. ఎంతో చనువు కూడా ఉంది. చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు చూస్తూ నేను పెరిగా. అలాంటి గొప్ప వ్యక్తి ప్రీరిలీజ్ వేడుకకు రావటం సంతోషంగా ఉంది. ‘భ్రద’ సినిమా కథ నాకే చెప్పారు. కానీ ‘ఆర్య’ చేయాల్సి రావటంతో అది కుదరలేదు. నన్ను బాగా ఇష్టపడే వ్యక్తుల్లో బోయపాటిగారు ఒకరు. బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘సింహా’తో మొదలైంది.. ‘లెజెండ్’తో దూసుకెళ్లింది. ‘అఖండ’తో అన్స్టాపబుల్ అవుతుంది. ఈ సినిమాతో మీరొక సరికొత్త శ్రీకాంత్ను చూస్తారు. బాలకృష్ణ ఈ స్థాయిలో ఉన్నారంటే రెండు కారణాలు ఉన్నాయి. సినిమా అంటే ఆయనకున్న డెడికేషన్, డిక్షన్. రెండు పేజీల డైలాగ్ అయినా ఎలాంటి మార్పూ లేకుండా డిక్షన్ చెబుతారు. బాలకృష్ణ రీల్లో అయినా, రియల్గా అయినా ఒకేలా ఉంటారు. మనకు నచ్చినట్లు మనం ఉండటం గొప్ప విషయం. అందులో బాలకృష్ణ స్పెషల్. ‘అఖండ’ జ్యోతిలా ఈ సినిమా వచ్చే సినిమాలకు మార్గదర్శనం చూపాలి’’ అని అల్లు అర్జున్ అన్నారు.'
ప్రస్తుత పరిస్థితుల్లో సినిమానే గెలవాలి: బోయపాటి
ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ‘‘ఒక సినిమా బాగా తీస్తే ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలు ఉదాహరణ. ఈ సినిమా చూసిన తర్వాత ఒక మంచి మూవీ చూశామన్న ఉత్సాహంతో ప్రేక్షకులు బయటకు వస్తారు. ‘అఖండ’ కోసం టెక్నీషియన్స్ ఎంతో కష్టపడి పనిచేశారు. ప్రతి విషయంలోనూ అందరూ చాలా సహకారం అందించారు. బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెండితెరపై మీరే చూస్తారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలను అభినందించాలి. 21 నెలల పాటు నా నిర్మాత ఎంతో ఓపికతో మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతో వేచి చూశారు. ‘జై బాలయ్య’ సాంగ్ ప్రాక్టీస్ చేస్తుండగా బాలకృష్ణ గాయపడ్డారు. అయినా కూడా నొప్పిని భరిస్తూ ఆ పాట పూర్తి చేశారు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నన్ను ప్రోత్సహించిన వ్యక్తి అల్లు అర్జున్. నా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన వ్యక్తి బాలకృష్ణ. ఇద్దరికీ నా ధన్యవాదాలు. ఒకరి సినిమాను మరొకరు ప్రోత్సహిస్తూ వెళ్లాలి. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమానే గెలవాలి’’ అని అన్నారు.
‘అఖండ’తో ఆ బ్రేక్ బద్దలవుతుంది: నిర్మాత మిర్యాల రవీందర్
నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అందరికీ కృతజ్ఞతలు. కరోనా కారణంగా థియేటర్లో సినిమా చూసే విషయంలో ఒక బ్రేక్ పడింది. డిసెంబరు 2న ‘అఖండ’తో ఆ బ్రేక్ బద్దలవుతుంది. ఆ తర్వాత ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’లు విజయ పరంపరను కొనసాగిస్తాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అల్లు అర్జున్, రాజమౌళిలకు ధన్యవాదాలు అని అన్నారు.
ఫొటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ చిత్రం ‘నాయట్టు’ ఇప్పుడు తెలుగు ఆడియోతో అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరోయిన్.. వైరలవుతోన్న హల్దీ ఫొటోలు..
హీరోయిన్ అపర్ణ దాస్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. హల్దీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప2’లో కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా తన పాత్ర గురించి వివరించారు. -
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
హిట్ జోడీ.. మళ్లీ సెట్!
నాయకానాయికలు తెరపై జంటగా కనిపించి ఒక్కసారి హిట్ జోడీ అనిపించుకుంటే చాలు.. మళ్లీ వారిద్దరి కలయికలో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? అని ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. -
ఒక్క పోరాటం 26 రోజులు
అగ్ర తారల సినిమా అనగానే పాటలు, పోరాటాలే గుర్తొస్తాయి. వాటిపై కథానాయకులు మరింత శ్రద్ధ తీసుకుంటుంటారు. సెట్లో ఎన్ని సవాళ్లు ఎదురైనా స్వీకరించి రాజీ పడకుండా నటిస్తుంటారు. -
ఈ వేసవిలో బాగా నవ్విస్తాం: అల్లరి నరేశ్
పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు అని వెంటపడేవాళ్లకి ఓ కొత్త సెక్షన్ పెట్టి లోపల వేయించండంటూ న్యాయస్థానంలో మొర పెట్టుకున్నాడు ఓ కుర్రాడు. అతని పెళ్లి గోల వెనక కథేమిటి? ఇంతకీ అతడికి పెళ్లయిందా లేదా? -
డైరెక్టర్స్ డేని ఘనంగా నిర్వహిస్తాం
‘‘భారతీయ సినిమాకి డైరెక్టర్స్ డే అనేది తలమానికం. తెలుగులో తప్ప ఇతర భాషల్లో ఎక్కడా ఇలాంటి ప్రయత్నం జరగలేదు. ఇందుకు కారణం... తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి, గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన ఏకైక దర్శకుడు దాసరి నారాయణరావు. -
గురిపెట్టిన సత్యభామ
కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న ‘సత్యభామ’ విడుదల ఖరారైంది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మే 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టుగా ఓ ప్రత్యేకమైన వీడియోతో ప్రకటించింది చిత్రబృందం. -
రజనీకాంత్ చిత్రం... కూలీ
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘కూలీ’ అనే పేరుని ఖరారు చేశారు. ఇది రజనీ 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
క్షమాపణలు యాడ్ సైజ్లోనే ప్రచురించారా? పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!