Pragya jaiswal: కథ వినకుండానే ‘అఖండ’ చేశా
తొలి అడుగుల్లోనే ప్రతిభ చాటింది ప్రగ్యా జైస్వాల్. ‘కంచె’ చిత్రంతో ఆమె చక్కటి అభినయం ప్రదర్శించింది. వరుసగా అవకాశాలు అందుకొంటోంది. ఇటీవల బాలకృష్ణ సరసన ‘అఖండ’లో నటించింది.
తొలి అడుగుల్లోనే ప్రతిభ చాటింది ప్రగ్యా జైస్వాల్. ‘కంచె’ చిత్రంతో ఆమె చక్కటి అభినయం ప్రదర్శించింది. వరుసగా అవకాశాలు అందుకొంటోంది. ఇటీవల బాలకృష్ణ సరసన ‘అఖండ’లో నటించింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఆ చిత్రం డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ప్రగ్యా జైస్వాల్ శుక్రవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించింది.
ఈ సనిమాలో అవకాశం సొంతమయ్యాక మీ మనసులో ఎలాంటి ఆలోచనలు వచ్చాయి?
2020 కరోనా తర్వాతే నాకు ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కెరీర్ని మళ్లీ కొత్తగా మొదలు పెడుతున్న అభిప్రాయం కలిగింది. దర్శకుడు బోయపాటి శ్రీనుపై చాలా నమ్మకం. ఆయన ఒక పాత్ర కోసం ఒకరిని అనుకున్నారంటే అది పక్కాగా ఓ మంచి ఎంపిక అవుతుంది. ఆయన ఎంతో ఆలోచించిగానీ నటుల్ని ఎంపిక చేసుకోరు. అందుకే ఈ సినిమా కోసం నన్ను సంప్రదించినప్పుడు కథ వినాలనిపించలేదు. కథ వినకుండానే చేస్తానని చెప్పా. బోయపాటిపై నాకు అంత నమ్మకం.
బాలకృష్ణతో కలిసి నటించడం ఎలా అనిపించింది?
అంత పెద్ద హీరోతో నేను ఇదివరకెప్పుడూ నటించలేదు. ఆయనతో అంతకుముందు రెండు మూడు సార్లు కలిశాను కానీ, సెట్కి వెళ్లిన తొలి రోజు భయంగా అనిపించింది. ఈ సినిమా సెట్కి వెళ్లిన తొలి రోజే బాలకృష్ణ సర్తో కలిసి సన్నివేశాలు చేయాల్సి వచ్చింది. సెట్లో అడుగు పెట్టగానే ఎంతో ఉత్సాహంగా ‘ప్రగ్యా...’ అంటూ పలకరించారు. ఐదు నిమిషాలకే నాలో భయాలన్నీ మాయమైపోయాయి. ఆయనది సమయం అంటే సమయమే. క్రమశిక్షణ, సమయపాలన విషయాల్లో ఆయన్నుంచి చాలా నేర్చుకున్నా. మూడు గంటలకే లేస్తారు, ఆరు గంటలకే సెట్కి వస్తారు. రోజంతా చిత్రీకరణలో పాల్గొంటారు. దర్శకుడు బోయపాటి శ్రీను నుంచి చాలా నేర్చుకున్నా. ఆయన నటులకి ఎంతో స్వేచ్ఛనిస్తారు. కొన్నిసార్లు ఆయన చెప్పింది చెప్పినట్టు చేసినా సరిపోతుంది. పాత్ర విషయంలో ఆయనకి అంత స్పష్టత ఉంటుంది.
ఈ కథ, మీ పాత్ర గురించి ఏం చెబుతారు?
‘అఖండ’ కథ, అందులోని పాత్రల్ని ఇప్పటివరకు నేను చూడలేదు. చాలా శక్తివంతమైన పాత్రలతో ఈ కథని తీర్చిదిద్దారు దర్శకుడు. ఇక నేనొక ఐఏఎస్ అధికారిగా కనిపిస్తా. కథంతా ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ‘నాకు ఎదురైన సంఘటనల వల్లే అఖండ పాత్ర తెరపైకొస్తుంది. ఇదివరకు చూసిన ప్రగ్యా ఇందులో అస్సలు కనిపించకూడద’ని చెప్పారు బోయపాటి. ఆ పాత్రని పోషించేందుకు చాలా కష్టపడ్డా. ఇలాంటి ఓ బలమైన, కీలకమైన పాత్రని పోషించే అవకాశం దొరకడం చాలా సంతృప్తినిచ్చింది.
ఇప్పటిదాకా సాగిన కెరీర్ని విశ్లేషించుకుంటే ఏమనిపిస్తోంది?
నా వరకు వచ్చిన కథల్లోంచి మంచి పాత్రల్ని ఎంచుకున్నా. కొన్ని ఫలితాల్నిచ్చాయి, కొన్ని ఇవ్వలేదు. ఫలితాలనేవి మన చేతుల్లో ఉండవు కదా. నేను మాత్రం మంచి కథలపై దృష్టిపెడుతూ, మంచి పాత్రల్ని ఎంచుకుంటూ వస్తున్నా. ఏడేళ్లుగా సాగుతున్న సినీ ప్రయాణం నాది. పనిని అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం తీసుకున్నా. డిజిటల్ వేదికలా లేక సినిమానా? అని సంబంధం లేకుండా... మంచి కథలు, మంచి బృందంతో కలిసి ప్రయాణం చేయాలనేది నా ప్రణాళిక.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Allari Naresh: అలాంటివాళ్ల టెన్షన్ను.. నవ్విస్తూ చూపించాం: అల్లరి నరేశ్
అల్లరి నరేశ్ (Allari Naresh) నటించిన వినోదాత్మక చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోయిన్. నరేశ్, ఫరియా, జెమీ లివర్ సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకున్నారు.
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇన్ఫీ లాభం 30 శాతం జంప్.. ఒక్కో షేరుపై ₹28 డివిడెండ్
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?