Acharya: ‘ఆచార్య’ ఫిబ్రవరి 4న

చిరంజీవి ‘ఆచార్య’ విడుదలకు ముహూర్తం కుదిరింది. ఈ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది

Updated : 10 Oct 2021 09:27 IST

చిరంజీవి ‘ఆచార్య’ విడుదలకు ముహూర్తం కుదిరింది. ఈ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు శనివారం సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల తేదీతో కూడిన కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్టర్‌లో చిరంజీవి ఉగ్రరూపంలో దర్శనమిచ్చారు. ఓ పదునైన ఆయుధంతో శత్రువులను వేటాడేందుకు వెళ్తున్నట్లుగా కనిపించారు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రమిది. చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి నటించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో చిరుకు జోడీగా కాజల్‌, చరణ్‌ సరసన పూజా హెగ్డే కనిపిస్తుంది. మణిశర్మ స్వరాలందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని