Romantic: ఈ పాత్ర గుర్తుండిపోతుంది
‘‘నేనిప్పుడు ఏదో ఒక జానర్కు పరిమితం కావాలని అనుకోవట్లేదు. మల్టీప్లెక్స్ నుంచి సింగిల్ స్క్రీన్ వరకు నా సినిమాల్ని అందరూ చూడాలని అనుకుంటున్నా. ఇకపై అలాంటి కథల్నే ఎంచుకోవాలనుకుంటున్నా’’ అన్నారు ఆకాష్ పూరి. ఇప్పుడాయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘రొమాంటిక్’.
‘‘నేనిప్పుడు ఏదో ఒక జానర్కు పరిమితం కావాలని అనుకోవట్లేదు. మల్టీప్లెక్స్ నుంచి సింగిల్ స్క్రీన్ వరకు నా సినిమాల్ని అందరూ చూడాలని అనుకుంటున్నా. ఇకపై అలాంటి కథల్నే ఎంచుకోవాలనుకుంటున్నా’’ అన్నారు ఆకాష్ పూరి. ఇప్పుడాయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాదూరి తెరకెక్కించారు. పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. కేతిక శర్మ కథానాయిక. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు ఆకాష్.
వాస్కోడిగామాగా...
‘‘ఇదొక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్. శక్తిమంతమైన పోరాటాలతో పాటు చాలా ఎమోషనల్ కంటెంట్ ఉంది. నేనిందులో వాస్కోడిగామా అనే పాత్రలో కనిపిస్తాను. ఈ చిత్రంలో ఊహించని మలుపులేమీ ఉండవు కానీ, కచ్చితంగా సినిమా చూస్తే ఎగ్జైట్ అవుతారు. చంటిగాడు, పండుగాడు, బుజ్జిగాడు అనే పాత్రలు ఎలా గుర్తుండిపోయాయో.. నా వాస్కోడిగామా పాత్ర అందరికీ అలా గుర్తుండిపోతుంది. రమ్యకృష్ణ గారితో పనిచేయడం అదృష్టంగా ఫీలవుతున్నా’’.
సక్సెస్ కొట్టాకే.. నాన్నతో సినిమా చేస్తా
‘‘ప్రీరిలీజ్ వేడుకలో నేను నాన్న గురించి మాట్లాడిన మాటలు విని ఆయన చాలా సర్ప్రైజ్ అయ్యారు. ఆయన గర్వంగా కాలర్ ఎగరేసేలా చేయాలి. అది ఈ చిత్రంతో జరుగుతుందా? మరో సినిమాతో సాధ్యమవుతుందా? అన్నది ఇప్పుడే చెప్పలేను. సక్సెస్ కొట్టాకే.. వెళ్లి నాన్నతో ఓ సినిమా చేస్తాను’’.
ఈ కథ చేస్తానని అసలు ఊహించలేదు
‘‘నాకోసమే ప్రత్యేకంగా సిద్ధం చేసిన కథ కాదిది. నాన్న ఈ సినిమా లైన్ ఎప్పుడో రాసి పెట్టుకున్నారు. ఆయన ఓరోజు దర్శకుడు అనిల్ని పిలిచి ‘ఈ సినిమాకు ఆకాష్ హీరో.. నువ్వు దర్శకుడివి’ అని చెప్పారు. దాంతో ఇద్దరం షాక్ అయ్యాం. ఎందుకంటే ఈ కథని నేను చేస్తానని.. అనిల్ తెరకెక్కిస్తారని ఎప్పుడూ ఊహించలేదు. ‘ఇస్మార్ట్ శంకర్’, ‘రొమాంటిక్’ రెండూ ఒకే సమయంలో జరిగాయి. అయితే ‘ఇస్మార్ట్..’ పెద్ద హిట్టవ్వడంతో.. దీన్ని ఇంకా బాగా తీయాలని అనుకున్నాం. అప్పుడే రమ్యకృష్ణ ఈ ప్రాజెక్ట్లోకి వచ్చారు. ఆమె రాకతో సినిమా స్థాయి మారిపోయింది’’.
భయమేసి పారిపోదామనుకున్నా..
‘‘ఈ కథ విన్నాక.. నాన్నని ఒకటే అడిగా. ఏం చేయమంటే అది చేస్తాను. ఎక్కడి నుంచి దూకమంటే అక్కడి దూకుతాను.. కానీ, ఈ రొమాన్స్ తగ్గించు నాన్న అన్నాను. సినిమానే రొమాంటిక్.. అందులో రొమాన్స్ తగ్గించమంటావేంట్రా అన్నారు. స్క్రీన్ మీద రొమాన్స్ చేయడం చాలా కష్టం. సెట్లో ఎన్నోసార్లు భయమేసింది. పారిపోదామా? అనిపించేది (నవ్వుతూ)’’.
‘‘ఇప్పుడే కాదు కానీ, ఓ పదేళ్ల తర్వాత అయినా సరే తప్పకుండా దర్శకత్వం చేస్తా. నాన్నకి రెమ్యునరేషన్ ఇచ్చి ఆయన కథ తీసుకొని.. దర్శకత్వం చేస్తా. ముందు హీరోగా నిరూపించుకున్న తర్వాతే డైరెక్షన్ వైపు దృష్టి పెడతా. ప్రస్తుతం ‘చోర్ బజార్’ సినిమా చేస్తున్నా. అందులో బచ్చన్ సాబ్ అనే పాత్రలో నటిస్తున్నా. వాణిజ్యాంశాలతో నిండిన యాక్షన్ ఎంటర్టైనర్ అది. చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. వచ్చే ఏడాది విడుదలవుతుంది’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!