PUSHPA: అప్పుడు రంగమ్మత్త ఇప్పుడు దాక్షాయణి

‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్తగా మెరిశారు అనసూయ. ఈసారి ఆమెని దాక్షాయణిగా చూపించనున్నారు సుకుమార్‌. ఆయన దర్శకత్వంలో అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన్న కథానాయిక. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు.

Updated : 11 Nov 2021 07:41 IST

‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్తగా మెరిశారు అనసూయ. ఈసారి ఆమెని దాక్షాయణిగా చూపించనున్నారు సుకుమార్‌. ఆయన దర్శకత్వంలో అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన్న కథానాయిక. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దాక్షాయణి అనే పాత్ర పోషిస్తున్నారు అనసూయ. ఆ పాత్రకి సంబంధించిన లుక్‌ని బుధవారం విడుదల చేశారు. అందులో అడకత్తెర పట్టుకుని పోకచెక్కలు పగలగొడుతున్నట్టుగా కనిపిస్తున్నారు అనసూయ. లుక్‌కి చక్కటి స్పందన లభిస్తోందని సినీ వర్గాలు తెలిపాయి. ‘అల వైకుంఠపురములో’ తర్వాత అల్లు అర్జున్‌, ‘రంగస్థలం’ తర్వాత సుకుమార్‌ కలిసి చేస్తున్న చిత్రమిది. తొలి భాగం ‘పుష్ప: ది రైజ్‌’ పేరుతో డిసెంబర్‌ 17న విడుదలవుతోంది. ప్రతినాయకుడిగా మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. సునీల్‌, రావు రమేష్‌, అజయ్‌ ఘోష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, పాటలు: చంద్రబోస్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని