Bollywood: యుద్ధ వీరులొస్తున్నారు..!
యుద్ధం అనేది వెండితెరకు కొత్త కథావస్తువేం కాదు. సరిగ్గా తెరకెక్కిస్తే ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. బిగి సడలని కథనం..ఆకట్టుకునే విజువల్ ఎఫెక్ట్స్తో కథను తీర్చిదిద్దితే ప్రేక్షకుడు యుద్ధంలో పోరాడుతున్న అనుభూతికి గురవుతాడు.
యుద్ధం అనేది వెండితెరకు కొత్త కథావస్తువేం కాదు. సరిగ్గా తెరకెక్కిస్తే ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. బిగి సడలని కథనం..ఆకట్టుకునే విజువల్ ఎఫెక్ట్స్తో కథను తీర్చిదిద్దితే ప్రేక్షకుడు యుద్ధంలో పోరాడుతున్న అనుభూతికి గురవుతాడు. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’, ‘షేర్షా’ లాంటి వార్ చిత్రాలు అందించిన ఉత్సాహంతో మరిన్ని యుద్ధ నేపథ్య సినిమాలు ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతున్నాయి. కంగనా రనౌత్, విక్కీ కౌశల్, వరుణ్ ధావన్, కార్తీక్ ఆర్యన్, ఇషాన్ కట్టర్...వీళ్లందరూ యుద్ధవీరులుగా తెరపై సందడి చేయనున్నారు.
దేశం కోసం ఎంతో శ్రమించి, అవసరమైతే ప్రాణాలు అర్పించిన వీరులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి యుద్ధవీరుల కథలో నటించడం గర్వంగా ఉందంటున్నారు యువ కథానాయకులు, నాయికలు. నాలుగు పాటలు, ఫైట్లు ఉండే రొటీన్ చిత్రాల కంటే ఎంత కష్టమైనా కొత్త దారిలోనే వెళతామంటూ సిద్ధమవుతున్నారు.
కంగన తేజసం
‘తలైవి’తో ప్రేక్షకుల్ని అలరించిన కంగన నటిస్తున్న వార్ చిత్రం ‘తేజస్’. పాత్ర ఎలాంటిదైనా అందులోకి కంగన ఎలా పరకాయ ప్రవేశం చేస్తుందో ప్రేక్షకులకు బాగా తెలుసు. ఇక పాత్ర విషయానికొస్తే ఎంతవరకూ అయినా వెళుతుంది. ఎలాంటి కష్టమైనా పడుతుంది కంగన. ఈ చిత్రంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలెట్గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ ముగిసింది. కొత్త దర్శకుడు సర్వేష్ మేవ్రా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దిల్లీ, ముంబయి, రాజస్థాన్ల్లో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ పైలెట్గా కంగన లుక్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకుంటోంది.
మానెక్షా పోరాటం
‘సర్దార్ ఉదమ్సింగ్’గా ప్రేక్షకుల్ని అలరిస్తున్న విక్కీ కౌశల్ నటిస్తున్న మరో జీవిత కథ ‘సామ్ మానెక్షా’. భారతీయ తొలి ఫీల్డ్ మార్షల్ అయిన సామ్ మానెక్షా 1971 భారత్ పాక్ యుద్ధంలో చీఫ్ ఆఫ్ ఆర్మీగా పనిచేశారు. ‘రాజీ’ లాంటి హిట్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన మేఘనా గుల్జార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రంలో విక్కీకు సంబంధించిన ఫస్ట్లుక్ను చిత్రబృందం విడుదల చేసింది.
చరిత్రలో నిలిచిపోయి
బాలీవుడ్లో దూసుకుపోతున్న యువతరం కథానాయకుల్లో కార్తీక్ ఆర్యన్ ఒకడు. ఆయన నుంచి రానున్న యుద్ధ నేపథ్య చిత్రం ‘కెప్టెన్ ఇండియా’. ప్రముఖ దర్శకుడు హన్సల్ మెహతా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కార్తీక్ పైలెట్గా నటిస్తున్నాడు. భారత దేశ చరిత్రలో విజయవంతమైన రెస్క్యూ అపరేషన్ను ఇందులో చూపించనున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని సెట్స్పైకి తీసుకెళ్లనున్నారు.
వీరజవాను కథతో!
బ్రిగేడియర్ బల్రామ్సింగ్ మెహతా జీవిత కథతో వస్తున్న చిత్రం ‘పిప్పా’. 1971 ఇండో పాక్ యుద్ధంలో పోరాడిన వీర జవాను కథ ఇది. ఇందులో పిప్పా అనే యుద్ధ ట్యాంక్ కీలకంగా నిలిచింది. అందుకే ఆ పేరే ఈ సినిమాకు పెట్టారు. ఇషాన్ కట్టర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, ప్రియాన్షు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో యుద్ధ సన్నివేశాల్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. అక్షయ్కుమార్ హీరోగా ‘ఎయిర్ లిఫ్ట్’ లాంటి హిట్ చిత్రాన్ని అందించిన రాజా మీనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
పరమ వీరచక్ర అర్జున్.. వరుణ్
పరమ వీరచక్ర గ్రహీత అర్జున్ ఖెటార్పాల్ జీవితం ఆధారంగా శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇక్కీస్’. ఈ చిత్రం 1971 భారత్, పాక్ యుద్ధం నేపథ్యంలోనే సాగుతుంది. ఇందులో ప్రధాన పాత్రలో వరుణ్ధావన్ నటిస్తున్నాడు. అర్జున్ ఖెటార్పాల్ గర్వపడేలా ఈ చిత్రాన్ని శ్రీరామ్రాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారనే నమ్మకం ఉంది’’అంటున్నారు వరుణ్. దినేష్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు