Chiranjeevi: దీపావళికి కొత్త చిత్రం

సినిమాల విషయంలో వేగం పెంచుతున్నారు అగ్ర హీరో చిరంజీవి. ప్రస్తుతం ఆయన నటించిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధమవుతుండగా.. ‘గాడ్‌ ఫాదర్‌’ సెట్స్‌పై ముస్తాబవుతోంది. వీటితో పాటు  దర్శకులు మెహర్‌ రమేష్‌, బాబీ  (కె.ఎస్‌.రవీంద్ర)లతోనూ చిరు సినిమాలు చేయాల్సి ఉంది. అయితే వీటిలో ముందుగా బాబీ చిత్రమే పట్టాలెక్కనున్నట్లు తెలిసింది. దీన్ని చిరంజీవి దీపావళి సందర్భంగా నవంబరు 6న ప్రారంభించనున్నట్లు సమాచారం.

Updated : 22 Oct 2021 07:55 IST

సినిమాల విషయంలో వేగం పెంచుతున్నారు అగ్ర హీరో చిరంజీవి. ప్రస్తుతం ఆయన నటించిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధమవుతుండగా.. ‘గాడ్‌ ఫాదర్‌’ సెట్స్‌పై ముస్తాబవుతోంది. వీటితో పాటు  దర్శకులు మెహర్‌ రమేష్‌, బాబీ  (కె.ఎస్‌.రవీంద్ర)లతోనూ చిరు సినిమాలు చేయాల్సి ఉంది. అయితే వీటిలో ముందుగా బాబీ చిత్రమే పట్టాలెక్కనున్నట్లు తెలిసింది. దీన్ని చిరంజీవి దీపావళి సందర్భంగా నవంబరు 6న ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే సన్నాహాలు మొదలైనట్లు తెలుస్తోంది. శక్తిమంతమైన మాస్‌ మసాలా కథాంశంతో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలిసింది. ఆ మధ్య చిరు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ప్రీలుక్‌తో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ చిత్రం కోసం ‘వాల్తేరు వాసు’తో పాటు పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు