Ramayan: ఒక్కొక్కరికీ రూ.75 కోట్లు!

రామాయణ కథాంశాన్ని అనేక విధాలుగా వెండితెరపై ప్రేక్షకులు చూశారు. తాజాగా కూడా రామాయణం ఆధారంగా కొన్ని చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు రామాయణం కథను వెబ్‌సిరీస్‌గా తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది.

Updated : 10 Oct 2021 09:32 IST

రామాయణ కథాంశాన్ని అనేక విధాలుగా వెండితెరపై ప్రేక్షకులు చూశారు. తాజాగా కూడా రామాయణం ఆధారంగా కొన్ని చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు రామాయణం కథను వెబ్‌సిరీస్‌గా తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. సుమారు రూ.750 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ వెబ్‌సిరీస్‌ను నితీష్‌ తివారీ రూపొందించనున్నట్లు సమాచారం. ఇందులో రామ, రావణులుగా రణ్‌బీర్‌ కపూర్‌, హృతిక్‌ రోషన్‌ నటించబోతున్నారట. దీని కోసం ఇద్దరికీ చేరో రూ.75 కోట్లు పారితోషికం ఇవ్వనున్నట్లు బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మధు మంతెన దీన్ని నిర్మించనున్నారు. ‘‘ఇప్పటివరకూ రామాయణాన్ని చూడని విధంగా చాలా భారీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు’’ అని నితీష్‌ సన్నిహితులు చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో సీతగా కరీనా నటిస్తున్నట్లు వార్తలొస్తున్నా వాటిలో నిజం లేదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని