National Film Awards: సందేశమే సినిమా అంతిమ లక్ష్యం కావాలి
‘‘సినిమా సమున్నత సామాజిక, నైతిక సందేశాన్ని చాటి చెప్పేలా ఉండాలి. హింసను ప్రదర్శించడంలో సంయమనం పాటిస్తూనే, సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా సమాజం తరఫున గళమెత్తాలి. మితిమీరిన అశ్లీలత,
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి పిలుపు
67వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న రజనీకాంత్
‘‘సినిమా సమున్నత సామాజిక, నైతిక సందేశాన్ని చాటి చెప్పేలా ఉండాలి. హింసను ప్రదర్శించడంలో సంయమనం పాటిస్తూనే, సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా సమాజం తరఫున గళమెత్తాలి. మితిమీరిన అశ్లీలత, అసభ్యతను విడనాడాలి. సినిమా అంతిమ లక్ష్యం సందేశం కావాలి’’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సినిమా రూపకర్తలకు పిలుపునిచ్చారు. ఆయన సోమవారం ఉదయం దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన 67వ జాతీయ చలన చిత్ర పురస్కార వేడుకలో ప్రముఖ నటుడు రజనీకాంత్కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంతో పాటు, జాతీయ చలన చిత్ర పురస్కార విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. మనం మాతృమూర్తిని, మాతృభాషను, మాతృభూమిని ఎట్టిపరిస్థితుల్లోనూ మరువకూడదని పేర్కొన్నారు.
సినిమాల ద్వారా మాతృభాషలను ప్రోత్సహించాలన్నారు. ‘‘సినిమా పరిశ్రమ మనకు ఉల్లాసం, ఉత్సాహం, వినోదం, స్ఫూర్తినిస్తూనే మనసును తేలిక పరిచి గుండెను బరువెక్కిస్తుంది. ప్రపంచంలో అత్యంత చౌకైన వినోదం సినిమానే. సినిమా నిర్మించడం ఖరీదైనపనిగా మారినప్పటకీ సినిమా చూడటం మాత్రం చౌకగానే ఉంటోంది. సినిమా దగ్గరకు నీవు వెళ్లలేకపోయినా ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా కారణంగా అదే నీ దగ్గరకు వస్తోంది. సామాజిక మాధ్యమం ఒకవైపు ఉపయోగకరమైనా, మరోవైపు అది అంత నిర్మాణాత్మకంగా లేదు. కొన్నిసార్లు అది అడ్డంకిగా, మరికొన్నిసార్లు విధ్వంసకరంగా మారుతోంది. అది తనను తాను సరిద్దుకోకపోతే తన ఉనికిని కోల్పోతుంది. రజనీకాంత్ ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. నటనానైపుణ్యంతో భారతీయ సినిమాకి కొత్త రూపును సంతరించిపెట్టారు. ఈ జాతీయ సినిమా అవార్డులు దేశ సినిమారంగ వైవిధ్యతను చాటుతాయి. ప్రతిభాషా తనదైన ప్రేక్షకులకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ సినిమాలు తీస్తోంది. భారతీయ వైవిధ్యతకు నిజమైన నివాళి ఈ అవార్డులు. సినిమాలు మన సాంస్కృతిక వారధులు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు తమ మూలాలతో అనుసంధానమై ఉండటానికి సినిమాలు ఒక సాధనంలా పనిచేస్తున్నాయి. మన పెద్దలు మనకు ఇచ్చిపోయిన సుసంపన్నసంప్రదాయాలు, సంస్కృతులను కాపాడుకోవడానికి సినిమారంగం కృషిచేయాలి. ఇక్కడ ప్రాంతీయ సినిమాలంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. భారతీయ భాషలన్నీ జాతీయ భాషలే కాబట్టి అందులో నిర్మితమయ్యే సినిమాలు కూడా జాతీయ సినిమాలే. వాటిని ప్రాంతాలకు పరిమితం చేయడం సరికాదు. భారతీయ సినిమా అభివృద్ధికి తెలుగు సినిమా గొప్ప చేయూతనందించింది. జాతీయస్థాయి అవార్డు దక్కించుకొన్న తొలి తెలుగుచిత్రం ‘పెద్దమనుషులు’ దగ్గరి నుంచి మొన్నటి ‘జెర్సీ’వరకు ఎన్నో అడ్డంకులను అధిగమించి తెలుగు చిత్రపరిశ్రమ గొప్ప శిఖరాలకు చేరుకొంది. సృజనాత్మక ఆలోచనలు కలిగిన సినిమా రూపకర్తలు ఆ తెలివితేటలను సమాజ ఉన్నతికోసం ఉపయోగించాలి. ప్రజలు గుర్తుపెట్టుకొనేలా ఉండాలి. దివంగత ఎన్టీరామారావు, నాగేశ్వరరావులాంటి నటులను చూసి ఒక్కో సినిమా ఏడాదిన్నరపాటు నడిచేది. కానీ ఇప్పుడు ఒక్కపూటకూడా నడవని పరిస్థితి నెలకొంది. అందువల్ల ప్రజలకు సందేశంతోపాటు, సంతోషం, ఉపశమనం కల్గించే సినిమాలు నిర్మించడంపై దృష్టి సారించాలి. ఇప్పుడు కావాల్సింది సానుకూలతే తప్ప ప్రతికూలతకాదు. స్వతంత్ర దేశంగా ఉన్న మనం మన ప్రజలు, రాబోయే తరాల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందించాలి. ప్రభుత్వం తప్పుచేస్తే విమర్శించవచ్చుకానీ, అడ్డంకులు కల్పించకూడదు. నిర్మాణాత్మకంగా సూచనలు చేయాలి.
- ఈనాడు, దిల్లీ
గురువు కె.బాల చందర్కు అంకితం
‘‘అత్యంత ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో నన్ను గౌరవించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ అవార్డును నా మార్గదర్శకులు, గురువు కె.బాలచందర్కు అంకితం చేస్తున్నాను. ఆయనతోపాటు నన్ను తండ్రిలా పెంచి పోషించిన సోదరుడు సత్యనారాయణ గైక్వాడ్నూ ఈ సందర్భంలో కృతజ్ఞతాభావంతో గుర్తుచేసుకుంటున్నాను. ఆయన నన్ను విలువలతో పెంచడంతోపాటు నాలో ఆధ్యాత్మికతను పెంపొందించారు. అలాగే బస్సు డ్రైవర్గా పనిచేస్తూ నన్ను ప్రోత్సహించిన స్నేహితుడు రాజ్బహదూర్నుకూడా గుర్తుచేసుకుంటున్నాను. నేను బస్సు కండెక్టర్గా ఉన్నప్పుడు నాలోని నటుణ్ని గుర్తించి సినిమాల్లోకి వెళ్లేలా ప్రోత్సహించారు. వీరందరితోపాటు నాతో సినిమాలు నిర్మించిన దర్శకులు, నిర్మాతలు, నా సినిమాలకు పనిచేసిన సాంకేతిక నిపుణులు, సహనటులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, మీడియా, అభిమానులందరికీ ఈ గౌరవం దక్కుతుంది. తమిళనాడు ప్రజలు లేకుంటే నేను లేను. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
- రజనీకాంత్
పురస్కార గ్రహీతలు వీళ్లే
ఉత్తమ నటుడు పురస్కారం 2019కిగానూ ఇద్దరికి దక్కింది. ‘అసురన్’ చిత్రానికిగానూ ధనుష్, ‘భోంస్లే’ చిత్రానికిగానూ మనోజ్ బాజ్పాయ్ పురస్కారం అందుకున్నారు. ఉత్తమ నటి పురస్కారాన్ని కంగనా రనౌత్ (మణికర్ణిక, పంగా), ఉత్తమ దర్శకుడిగా సంజయ్ పురాన్ సింగ్ చౌహాన్ (బహత్తర్ హురైన్), ఉత్తమ చిత్రం ‘మరక్కర్’కిగానూ ఆ చిత్ర దర్శకుడు ప్రియదర్శన్ పురస్కారం అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా విజయ్ సేతుపతి(సూపర్ డీలక్స్), ఉత్తమ సహాయనటిగా పల్లవీ జోష్ (ది తాష్కెంట్ ఫైల్స్) అవార్డు స్వీకరించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచిన ‘జెర్సీ’కిగానూ ఆ చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నిర్మాత నాగవంశీ, ఉత్తమ ఎడిటర్గా నవీన్నూలి (జెర్సీ), ఉత్తమ వినోదాత్మక చిత్రంగా నిలిచిన ‘మహర్షి’ చిత్రానికిగానూ దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు, ఉత్తమ కొరియోగ్రాఫర్గా రాజు సుందరం (మహర్షి) పురస్కారాలు అందుకున్నారు. జాతీయ సమగ్రత విభాగంలో నర్గీస్ దత్ జాతీయ పురస్కారం మలయాళ చిత్రం ‘తాజ్ మహల్’కు, సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రం విభాగంలో మలయాళ చిత్రం ‘ఆనంది గోపాల్’కు దక్కాయి. ఉత్తమ తొలిచిత్ర దర్శకత్వంకు గానూ ఇంధిరా గాంధీ అవార్డుని మతుకుట్టీ (హెలెన్) అందుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
నటి, గాయని స్మిత (Smita) నివాసంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
మనసంతా.. ఫాంటసీ
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు.. -
‘విక్రమార్కుడు2’ కోసం కథ సిద్ధమైంది
‘‘తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’ చిత్రాల కోసం కథ సిద్ధమైంది. నటుల ఎంపిక పూర్తవ్వగానే సినిమాని పట్టాలెక్కిస్తాం’’ -
గురుశిష్యులుగా తండ్రీకూతుళ్లు?
సినిమాల్లో నటనతో మెప్పించే కథానాయకులు.. వారి వారసులను తెరపైకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అనే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. -
ఈ వేసవిలో... ‘మనమే’
‘చాలా మంచోడిగా కనిపిస్తా, కానీ మంచోడినా? కాదు’ అని చెప్పుకునే ఓ అబ్బాయి. ‘ఒకరికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే మన క్యారెక్టర్’ అని నమ్మే ఓ అమ్మాయి. -
నిర్ణయించుకో.. నిన్నెవరు పాలించాలో!
‘రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే... మీ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయి సర్?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు ఓ పాత్రికేయుడు. మరి సదరు నాయకుడి సమాధానం ఏమిటో తెలియాలంటే ‘ప్రతినిధి2’ చూడాల్సిందే. -
రెట్టింపు నవ్వులతో... ‘మ్యాడ్ స్క్వేర్’
‘టిల్లు స్క్వేర్’తో విజయాన్ని సొంతం చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ... మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించింది. -
బేబి కీర్తి.. సెట్లో సందడి
ఇతర భాషల్లో నటించి మంచి క్రేజ్ని సొంతం చేసుకున్న నాయకానాయికలు ఎందరో. ఇప్పుడదే జాబితలో చేరింది అందాల కథానాయిక కీర్తి సురేశ్. ‘బేబి జాన్’తో ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. -
‘బాక్’.. వారం వెనక్కి
సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్’. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan).
తాజా వార్తలు (Latest News)
-
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?