Aadavaallu Meeku Joharlu: రాజమండ్రిలో చిత్రీకరణ

శర్వానంద్‌, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’. కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణ

Updated : 25 Oct 2021 07:28 IST

ర్వానంద్‌, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’. కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణ రాజమండ్రిలో మొదలైంది. ప్రధాన తారాగణంపై  తెరకెక్కించనున్న కీలక సన్నివేశాలతో టాకీ భాగం పూర్తి కానున్నట్టు సినీ వర్గాలు వెల్లడించాయి. ‘‘కుటుంబ వినోదంతో కూడిన చిత్రమిది. శర్వానంద్‌ పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూ అలరిస్తాడు. రష్మిక మందన్న పాత్ర ఓ మంచి అనుభూతిని పంచుతుంది. ఇతర మహిళల పాత్రలు అలరిస్తాయి. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి చక్కటి స్పందన  లభించింద’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఖుష్బూ, రాధిక శరత్‌కుమార్‌, ఊర్వశి, వెన్నెల కిశోర్‌, రవిశంకర్‌, సత్య, ప్రదీప్‌ రావత్‌, గోపరాజు, బెనర్జీ, కల్యాణీ నటరాజన్‌, రాజశ్రీ నాయర్‌, ఝాన్సీ, రజిత, సత్యకృష్ణ, ఆర్సీఎమ్‌ రాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, ఛాయాగ్రహణం: సుజిత్‌ సారంగ్‌, కూర్పు: శ్రీకర్‌ప్రసాద్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని