MAA Elections: ‘మా’ ఎన్నికల్లో రాజకీయ జోక్యం
మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో రాజకీయ జోక్యం ఉందంటూ ఆరోపణలు చేశారు ప్రకాశ్రాజ్. ఆ మేరకు కొన్ని ఆధారాలతో ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణమోహన్కి లేఖ...
ప్రకాష్రాజ్ ఆరోపణ
మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో రాజకీయ జోక్యం ఉందంటూ ఆరోపణలు చేశారు ప్రకాశ్రాజ్. ఆ మేరకు కొన్ని ఆధారాలతో ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణమోహన్కి లేఖ రాశారు. ఈ విషయంపై ఆయన ట్వీట్ చేశారు. అందులో జగ్గయ్య పేటకి చెందిన వైకాపా కార్యకర్త నూకల సాంబశివరావు ఎన్నికలు జరుగుతున్న ప్రాంతంలో మంచు విష్ణుతో కలిసున్న ఫొటోని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డితో కలిసున్న ఫొటోని పంచుకున్నారు. సాంబశివరావుపై క్రిమినల్ కేసులూ ఉన్నాయంటూ, అందుకు సంబంధించిన ఆధారాల్ని ట్విటర్లో పంచుకున్నారు ప్రకాశ్రాజ్. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతంలోకి ఇలా వేరొకరిని ఎలా అనుమతించారంటూ తన లేఖలో ప్రశ్నించారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ‘ఇది ప్రారంభం మాత్రమే. ఇప్పటికైనా మాకు సీసీ టీవీ ఫుటేజీ ఇవ్వండి. ఎన్నికలు ఎలా జరిగాయి? పోలింగ్ బూత్లో అసలేం జరిగిందో ప్రపంచానికి తెలియాలి’ అంటూ ట్వీట్ చేశారు ప్రకాశ్రాజ్.
వీడియో కెమెరాల ఫుటేజీ ఇచ్చే అధికారం అధ్యక్షుడి చేతుల్లోనే..
దీనిపై ఎన్నికల అధికారి కృష్ణమోహన్ని ‘ఈనాడు సినిమా’ సంప్రదించగా, తనకి ప్రకాశ్రాజ్ లేఖ మెయిల్ ద్వారా అందిందనీఅయితే సీసీ కెమెరాల ఫుటేజీ ఇచ్చే అధికారం తన చేతుల్లో లేదని, ఎన్నికల అనంతరం అధికారం అంతా అధ్యక్షుడి చేతిలోనే ఉంటుందని చెప్పారు.
సునీతాకృష్ణన్ సలహాదారుగా...
చిత్ర పరిశ్రమలోని మహిళల రక్షణ నిమిత్తం పద్మశ్రీ పురస్కార గ్రహీత సునీత కృష్ణన్ గౌరవ సలహాదారుగా మహిళల సాధికారికత- ఫిర్యాదు సెల్కి సంబంధించిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు. నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులతో కూడిన ఈ కమిటీ విశాఖ గైడ్లైన్స్ని అమలు చేయడం కోసం పనిచేస్తుందని, త్వరలోనే ఈ కమిటీని వెల్లడిస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి -
500మంది డ్యాన్సర్లతో వెల్కమ్ ఆటాపాటా
బాలీవుడ్లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. -
మోహన్లాల్ 360 షురూ
ప్రయోగాత్మక కథలు, భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినీప్రియుల్ని మెప్పించే మోహన్లాల్.. ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్360’ (వర్కింగ్ టైటిల్). తరుణ్ మూర్తి తెరకెక్కిస్తున్నారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!