Rashi khanna: ఆ మాటకు రోజులు చెల్లిపోతున్నాయి

‘‘ఓ చిత్రంతో నటిగా ఎంతటి విజయాన్ని అందుకున్నా.. ప్రతి సినిమాకీ అత్యుత్తమ ప్రతిభ కనబరిస్తేనే పరిశ్రమలో నిలదొక్కుకోగలగుతాం’’ అంటోంది నటి రాశి ఖన్నా. ప్రస్తుతం ఆమె అజయ్‌ దేవగణ్‌తో ‘రుద్ర’ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్న సంగతి   తెలిసిందే.

Updated : 30 Oct 2021 09:21 IST

‘‘ఓ చిత్రంతో నటిగా ఎంతటి విజయాన్ని అందుకున్నా.. ప్రతి సినిమాకీ అత్యుత్తమ ప్రతిభ కనబరిస్తేనే పరిశ్రమలో నిలదొక్కుకోగలగుతాం’’ అంటోంది నటి రాశి ఖన్నా. ప్రస్తుతం ఆమె అజయ్‌ దేవగణ్‌తో ‘రుద్ర’ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్న సంగతి   తెలిసిందే. ఈ సిరీస్‌కు ఎంపిక కావడానికి ముందు తను ఆడిషన్స్‌లో పాల్గొన్నట్లు తెలిపింది. ‘‘స్టార్‌డమ్‌ అనే పదానికి రోజులు చెల్లిపోతున్నాయి. ఎంతటి సీనియర్‌ నటి అయినా.. ఎన్ని విజయాలు వెనకాలున్నా.. ప్రతిదీ తొలి చిత్రం అన్నట్లుగానే కష్టపడాల్సిందే. మనలోని నటిని ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిందే. అందుకే నేను సీనియర్‌ నటిని అయినా.. ఎలాంటి పట్టింపులు లేకుండా ‘రుద్ర’ ఆడిషన్స్‌లో పాల్గొని నిరూపించుకున్నా’’ అని రాశి ఖన్నా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె తెలుగులో నాగచైతన్యతో ‘థ్యాంక్‌ యూ’ సినిమా చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని