Sarkaru Vaari Paata: భాగ్యనగరిలో.. సర్కారు పాట

మహేష్‌ బాబు కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సర్కారు వారి పాట’. పరశురామ్‌ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, 14రీల్స్‌ ప్లస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్‌ కథానాయిక. ఇటీవలే నార్వేలో కీలక షెడ్యూల్‌ పూర్తి చేసుకుని 

Updated : 11 Nov 2021 07:30 IST

మహేష్‌ బాబు కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సర్కారు వారి పాట’. పరశురామ్‌ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, 14రీల్స్‌ ప్లస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్‌ కథానాయిక. ఇటీవలే నార్వేలో కీలక షెడ్యూల్‌ పూర్తి చేసుకుని తిరిగొచ్చిన చిత్ర బృందం.. ఇప్పుడు హైదరాబాద్‌లో మరో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది. ఈ విషయాన్ని దర్శక నిర్మాతలు బుధవారం ప్రకటించారు. ఈ సుదీర్ఘ షెడ్యూల్‌లో భాగంగా మహేష్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. ఇందులో మహేష్‌ బ్యాంక్‌ అధికారిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1న ప్రేక్షకుల తీసుకురానున్నారు. సంగీతం: తమన్‌, కూర్పు: మార్తాండ్‌ కే వెంకటేష్‌, ఛాయాగ్రహణం: ఆర్‌.మధి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని