AthidiDevobhava: అతిథి విచ్చేస్తున్నాడు

ఆది సాయి కుమార్‌, నువేక్ష జంటగా పొలిమేర నాగేశ్వర్‌ తెరకెక్కించిన చిత్రం ‘అతిథి దేవో భవ’. రాజాబాబు మిర్యాల, అశోక్‌ రెడ్డి మిర్యాల సంయుక్తంగా నిర్మించారు. శేఖర్‌ చంద్ర స్వరాలందించారు. ఈ సినిమాని జనవరి 7న విడుదల

Updated : 15 Aug 2022 16:21 IST

ఆది సాయి కుమార్‌, నువేక్ష జంటగా పొలిమేర నాగేశ్వర్‌ తెరకెక్కించిన చిత్రం ‘అతిథి దేవో భవ’. రాజాబాబు మిర్యాల, అశోక్‌ రెడ్డి మిర్యాల సంయుక్తంగా నిర్మించారు. శేఖర్‌ చంద్ర స్వరాలందించారు. ఈ సినిమాని జనవరి 7న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఆదివారం ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో హీరో ఆది  మాట్లాడుతూ.. ‘‘మంచి స్పాన్‌ ఉన్న సినిమా ఇది. కొత్తగా ఉంటుంది. పాత్రలన్నీ చాలా భిన్నంగా ఉంటాయి. తప్పకుండా థియేటర్‌కు వచ్చి ఆశీర్వదించండి’’ అన్నారు. ‘‘ఆది కెరీర్‌లోనే భిన్నమైన జానర్‌ ఇది. నాకీ అవకాశమిచ్చిన హీరో, నిర్మాతలకు ధన్యవాదాలు. ఈనెల 7న విడుదల కానున్న మా చిత్రాన్ని   ఆదరిస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు దర్శకుడు. నిర్మాతలు రాజాబాబు, అశోక్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో ఆదిని భిన్నమైన కోణంలో చూస్తారు. అందరి సహకారంతో సినిమాని అనుకున్నట్లుగా పూర్తి చేశామ’’న్నారు. ఈ చిత్రానికి కూర్పు: కార్తీక్‌ శ్రీనివాస్‌, ఛాయాగ్రహణం: అమరనాథ్‌ బొమ్మిరెడ్డి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని