Aamir Khan: గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వాములైన ఆమిర్‌ఖాన్‌

కోట్ల హృదయాలను కదిలించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ భాగస్వాములయ్యారు. హైదరాబాద్‌ వచ్చిన ఆమిర్‌ఖాన్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బేగంపేట ..

Updated : 19 Sep 2021 22:10 IST

హైదరాబాద్‌: కోట్ల హృదయాలను కదిలించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ భాగస్వాములయ్యారు. హైదరాబాద్‌ వచ్చిన ఆమిర్‌ఖాన్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బేగంపేట విమానాశ్రయం ఆవరణలో మొక్కలు నాటారు. ఆయనతో పాటు టాలీవుడ్‌ నటుడు అక్కినేని నాగచైతన్య, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు. మొక్కలు నాటాలనే అద్భుతమైన ఛాలెంజ్‌ను అందించిన ఎంపీ సంతోష్‌ కుమార్‌కు అమీర్‌ఖాన్‌ కృతజ్ఞతలు తెలిపారు. తప్పనిసరిగా అంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన అమీర్‌ఖాన్‌ .. మొక్కలు నాటడం ద్వారా భవిష్యత్‌ తరాలు జీవించేందుకు అవకాశం ఇచ్చిన వాళ్లం అవుతామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు