Acharya: ఆ రెండు మినహా ‘ఆచార్య’  పూర్తయింది

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. కాజల్‌ అగర్వాల్‌ కథానాయిక. ఈ సినిమా వేసవిలోనే సందడి చేయాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది.

Published : 04 Aug 2021 16:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. కాజల్‌ అగర్వాల్‌ కథానాయిక. ఈ సినిమా వేసవిలోనే సందడి చేయాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. లాక్‌డౌన్‌ అనంతరం చిత్రీకరణ పునఃప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా దానికి సంబంధించిన అప్‌డేట్‌ని అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. నేటితో టాకీ పార్ట్‌కి సంబంధించిన షూటింగ్‌ పూర్తయినట్టు సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేసింది. రెండు పాటల చిత్రీకరణ మిగిలి ఉన్నట్టు పేర్కొంది. అన్ని కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. దేవాదాయ శాఖ నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. చిరంజీవి తనయుడు, నటుడు రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రామ్‌ చరణ్‌కి జోడీగా పూజా హెగ్డే కనిపించనుంది. మరోవైపు మలయాళీ చిత్రం ‘లూసీఫర్‌’ తెలుగు రీమేక్‌కి సిద్ధమయ్యారు చిరంజీవి. ఈ చిత్రాన్ని మోహన్‌ రాజా తెరకెక్కించనున్నారు. కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని