MEB: మీ నమ్మకాన్ని నిలబెట్టే వరకూ నిద్రపోను: అఖిల్‌

అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్‌ రూపొందించిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. అక్టోబరు 15న ఈ సినిమా విడుదలకానుంది. ఈ నేపథ్యంలోనే నాగ చైతన్య ముఖ్య అతిథిగా చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ఏర్పాటు చేసింది. 

Updated : 30 Aug 2022 15:57 IST

హైదరాబాద్‌: అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్‌ రూపొందించిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. అక్టోబరు 15న ఈ సినిమా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో నాగ చైతన్య ముఖ్య అతిథిగా చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా అఖిల్‌ మాట్లాడుతూ... ‘ఓ మంచి సినిమా తీశామని గర్వంగా చెబుతున్నా. దర్శకుడు భాస్కర్‌ పనితనం, సినిమాపై ఆయనకున్న ఆసక్తిని చూసి ఆశ్చర్యపోయా. ఆయనతో చేసిన ప్రయాణాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌. పూజా హెగ్డే తన అందం, అభినయంతో మిమ్మల్ని అలరిస్తుంది. థియేటర్లకి పూర్వ వైభవం వస్తుందనే పాజిటివ్‌ ఆలోచనతోనే మీ ముందుకొస్తున్నాం. నాపై మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే వరకూ నిద్రపోను’ అని అఖిల్‌ అన్నారు.

అఖిల్‌లో అదే నాకు నచ్చుతుంది: నాగ చైతన్య

‘రోజులు, పరిస్థితులు మారతాయి. కానీ, మీ (అభిమానుల) ఎనర్జీ ఎప్పటికీ మారదు. దర్శకుడు భాస్కర్‌ ప్రతి కథలోనూ ఎన్నో కొత్త కోణాల్ని చూస్తారు. భావోద్వేగాల్ని చాలా బాగా హ్యాండిల్‌ చేస్తారు. అఖిల్‌ సినిమా ఫలితాన్ని ఆశించడు. దానికోసం చేసే ప్రయత్నాన్ని మాత్రమే ప్రేమిస్తాడు. అదే తనలో నాకు నచ్చిన విషయం’ అని నాగ చైతన్య అన్నారు. ఈ కార్యక్రమంలో పూజా హెగ్డే, అల్లు అరవింద్‌, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని