Akshay Kumar:  ఐసీయూలో తల్లిని పరామర్శించిన అక్షయ్‌

ప్రముఖ నటుడు అక్షయ్‌ తల్లి అరుణ భాటియా అస్వస్థతకి గురయ్యారు. ముంబయిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Published : 06 Sep 2021 23:15 IST

ముంబయి: బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్‌ కుమార్ మాతృమూర్తి అరుణ భాటియా అస్వస్థతకి గురయ్యారు. ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఐ.సి.యు)లో ఉన్నారు. ‘సిండ్రెల్లా’ సినిమా చిత్రీకరణ కోసం లండన్‌ వెళ్లిన అక్షయ్‌ ఈ విషయం తెలియగానే హుటాహుటిన బయలుదేరి, ముంబయి చేరుకున్నారు. ఆసుపత్రికి వెళ్లి, తన తల్లిని కలిశారని సమాచారం. తన తల్లిపై ఉన్న ప్రేమని అక్షయ్‌ కుమార్ సోషల్‌ మీడియా వేదికగా వ్యక్తం చేస్తుంటారు. తన గత సినిమా ‘బెల్‌బాటమ్‌’ చిత్రీకరణ సమయంలో భావోద్వేగ పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతానికి అక్షయ్‌ పాత్రతో సంబంధంలేని సన్నివేశాల్ని ‘సిండ్రెల్లా’ చిత్రబృందం చిత్రీకరించనుందని సమాచారం. ఈ చిత్రాన్ని రంజిత్‌ తివారి తెరకెక్కిస్తున్నారు. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కథానాయిక. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. అక్షయ్‌ ఈ సినిమాతోపాటు ‘అత్రాంగి రే’, ‘రక్షా బంధన్’, ‘రామ్‌ సేతు’ చిత్రాల్లో నటిస్తున్నారు. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో నటించిన ‘సూర్యవంశీ’ విడుదలకి సిద్ధంగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని