Akhanda: నన్ను అంకుల్ అని పిలవడం నచ్చలేదు: బాలకృష్ణ
తాను హీరోగా నటించిన ‘అఖండ’ చిత్రాన్ని నటుడు బాలకృష్ణ నగరంలోని ఓ థియేటర్లో చూశారు. అనంతరం మీడియాతో ముచ్చటించారు.
హైదరాబాద్: తాను హీరోగా నటించిన ‘అఖండ’ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ నగరంలోని ఓ థియేటర్లో చూశారు. అనంతరం మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రానికి అఖండ విజయం అందించిన ప్రేక్షకులకు, నా అభిమానులకు ముందుగా కృతజ్ఞతలు. కొత్తదనాన్ని వారు ఎప్పుడూ ఆదరిస్తారనడానికి ఈ చిత్ర విజయమే నిదర్శనం. చిన్నపిల్లలకూ ఈ సినిమా బాగా నచ్చింది. వారు నా దగ్గరకు వచ్చి ‘అంకుల్.. సినిమా అద్భుతంగా ఉంది’ అని చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ వారు నన్ను అంకుల్ అనడం నాకు నచ్చలేదు (నవ్వుతూ). ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం మా విజయం మాత్రమే కాదు చలన చిత్ర పరిశ్రమ విజయం. చిత్ర బృందం సమష్టి కృషి ఇది. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. ఎన్నో నిజాల్ని ఈ సినిమాలో చూపించాం. చరిత్ర సృష్టించాలన్నా మేమే.. దాన్ని తిరగరాయాలన్నా మేమే. ‘లెజెండ్’ సినిమాకి పనిచేస్తున్నప్పుడు ‘సింహా’ గురించి ఆలోచించలేదు. ‘అఖండ’ చిత్రానికి పనిచేస్తున్న సమయంలో ‘లెజెండ్’ గురించి ఆలోచించలేదు. పనిలో దేవుడున్నాడు. అందుకే పనినే మేం నమ్ముతాం’ అని తెలిపారు. బాలకృష్ణతోపాటు చిత్ర దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత తదితరులు ఈ సినిమాను తిలకించారు.
బాలకృష్ణ హీరోగా ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రమిది. ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. శ్రీకాంత్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై రవీందర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ తొలి ఆట నుంచే మంచి స్పందన అందుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..