Pushpa: ‘పుష్ప’ను మెచ్చిన చిరంజీవి.. దర్శకుడు సుకుమార్‌కు ప్రశంస

అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’.

Published : 27 Dec 2021 15:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు, సినీ ప్రముఖుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన ప్రముఖ నటుడు చిరంజీవి.. సుకుమార్‌ని కలిసి ఆయన్ను ప్రశంసించారు. సంబంధిత ఫొటోల్ని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ప్రతి సన్నివేశాన్నీ చిరంజీవి ఎంతగానో ఆనందించినట్టు పేర్కొంది. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రష్మిక కథానాయిక. సునీల్‌, ఫహద్‌ ఫాజిల్‌, అనసూయ, అజయ్‌ ఘోష్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ఈ సినిమా రెండో భాగం వచ్చే ఏడాది ప్రారంభంకానుంది. 

బాలీవుడ్‌లో హవా..

దక్షిణాది భాషలతోపాటు హిందీలోనూ ‘పుష్ప’ హవా కొనసాగుతోంది. రెండోవారంలోనూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకూ ఈ సినిమా (హిందీ వెర్షన్‌) రూ. 37 కోట్లు కలెక్ట్‌ చేసినట్టు సినీ వర్గాలు పేర్కొన్నాయి.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని