Kiran Abbavaram: అన్నయ్య మృతితో నటుడు తీవ్ర భావోద్వేగం
‘రాజావారు.. రాణీవారు’, ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ చిత్రాలతో ఇప్పుడిప్పుడే కెరీర్లో సెటిలవుతోన్న హీరో కిరణ్ అబ్బవరం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తన సోదరుడు రామాంజులును...
హైదరాబాద్: ‘రాజావారు.. రాణీవారు’, ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ చిత్రాలతో ఇప్పుడిప్పుడే కెరీర్లో ముందుకు వెళ్తున్న హీరో కిరణ్ అబ్బవరం భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తన సోదరుడు రామాంజులును గుర్తు చేసుకుని ఆయన ఎమోషనల్ అయ్యారు. శుక్రవారం ఉదయం ఇన్స్టా వేదికగా తన అన్నయ్యతో దిగిన ఫొటోలను షేర్ చేశారు.
‘‘రేయ్ కిరణ్.. మన ఊరికి సరిగ్గా రోడ్డు కూడా లేదు. అలాంటి ఊరి కోసం మనం ఏదో ఒకటి చేయాలి’’ అంటూ తనకి వీలైనంత దానికంటే ఎక్కువగా నన్ను సపోర్ట్ చేశాడు. నన్ను హీరోగా చూడటం కోసం తన ఆనందాలను వదులుకున్నాడు. కెరీర్లో ఇప్పుడిప్పుడే ఏదో సాధిస్తున్నాననుకునే సమయంలో మా అన్నయ్య నన్ను వదిలి వెళ్లిపోయాడు. ‘నన్ను ఎప్పుడు అందరికీ పరిచయం చేస్తావురా’ అని తరచూ అడుగుతుండేవాడు. ఏదైనా గట్టిగా సాధించిన తర్వాత పరిచయం చేయాలనుకున్నా.. కానీ, ఇలా పరిచయం చేయాల్సి వస్తుందనుకోలేదు. నా వెనుక ఉంది మా అన్నయ్య ‘‘అబ్బవరం రామాంజులు రెడ్డి’’. రోడ్డు ప్రమాదం కారణంగా ఇటీవల కన్నుమూశారు. డ్రైవింగ్ చేసేటప్పుడు దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ ఆనందం కోసం కష్టపడే వాళ్లు ఉంటారు. అది మీరు పొందకుండా పోతే వాళ్లు తట్టుకోలేరు’’ అని కిరణ్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Balakrishna: 2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..