Nagarjuna: తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల్ని అభ్యర్థిస్తున్నా.. నాగార్జున
‘తెలుగువారికి సినిమా అంటే ప్రేమ. సినీ పరిశ్రమకి మద్ధతివ్వాలని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల్ని అభ్యర్థిస్తున్నా’ అని అన్నారు ప్రముఖ నటుడు నాగార్జున.
ఇంటర్నెట్ డెస్క్: ‘తెలుగువారికి సినిమా అంటే ప్రేమ. సినీ పరిశ్రమకి మద్దతివ్వాలని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల్ని అభ్యర్థిస్తున్నా’ అని అన్నారు ప్రముఖ నటుడు నాగార్జున. ‘లవ్స్టోరి’ సక్సెస్ మీట్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడారు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రమిది. ఇటీవల విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్ని ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ‘2020 మార్చి నుంచి కరోనాతో పోరాడుతూనే ఉన్నాం. ఒక వేవ్ వచ్చిపోయిందనుకునే లోపు మరో వేవ్ వచ్చి దెబ్బతీసింది. ఇప్పుడిప్పుడే దాన్నుంచి బయటపడుతున్నాం. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల కరోనా ప్రభావం తగ్గింది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశమంతటా కొవిడ్ మరణాలు తగ్గుతున్నాయి. ముందుగా మనం దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. టాలీవుడ్కే కాదు అన్ని చిత్ర పరిశ్రమకి ‘లవ్స్టోరి’ ఒక ధైర్యానిచ్చింది. ఈ ఉత్సాహంతోనే మరిన్ని చిత్రాలు విడుదలవుతాయి. ఓ మంచి సినిమా అందించండి.. ‘మేం థియేటర్లకి వస్తాం’ అని తెలుగు ప్రేక్షకులు నిరూపించారు. సున్నితమైన కథని కమర్షియల్ హంగులతో చూపించాలంటే చాలా కష్టం. సెన్సిటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దాన్ని అద్భుతంగా డీల్ చేశారు. ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. ‘లవ్స్టోరి’ తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ క్లాసిక్గా నిలుస్తుందనే నమ్మకం ఉంది. యాక్టర్, స్టార్.. రెండూ వేరు. అలాంటిది నాగ చైతన్యని స్టార్ యాక్టర్గా చేసినందుకు శేఖర్కి ధన్యవాదాలు చెప్తున్నా. తెలుగువారికి సినిమా అంటే ప్రేమ. మమ్మల్ని (చిత్ర పరిశ్రమ) చల్లగా చూడాలని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలని అభ్యర్థిస్తున్నా. సినీ పరిశ్రమకి మద్దతు ఇస్తారని కోరుకుంటున్నా’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ప్రేమ పెళ్లికే తాను ఓటు వేస్తానని చెప్పారు. -
దక్షిణాది నటీనటులకేం తక్కువ.. సౌత్ వర్సెస్ నార్త్పై ప్రియమణి కామెంట్స్
దక్షిణాది నటీనటులు అన్ని భాషల్లోనూ రాణిస్తున్నారని ప్రియమణి అన్నారు. -
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మెప్పించిందా? -
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నానంటూ జరుగుతోన్న ప్రచారంపై నటి అనసూయ (Anasuya) స్పందించారు. -
రజనీ 171 టైటిల్ అనౌన్స్మెంట్.. లోకేశ్ కనగరాజ్ కామెంట్స్ వైరల్
రజనీకాంత్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. త్వరలో ఇది పట్టాలెక్కనుంది. -
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. -
2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!