Tollywood Drugs Case: ఈడీ విచారణకు హాజరైన నందు

తెలుగు సినీ పరిశ్రమలో సంచలనంగా మారిన మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్‌, నటి ఛార్మి, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ని సుదీర్ఘంగా విచారించారు.

Updated : 07 Sep 2021 14:23 IST

హైదరాబాద్‌: తెలుగు సినీ పరిశ్రమలో సంచలనంగా మారిన మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈడీ అధికారులు దర్శకుడు పూరీ జగన్నాథ్‌, నటి ఛార్మి, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ని సుదీర్ఘంగా విచారించారు. నటుడు నందు మంగళవారం ఈ విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్‌ కోణంలో నందుకి సంబంధించిన  అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. అయితే నందు ఈ నెల 20న హాజరుకావాల్సి ఉండగా.. ముందుగానే అధికారుల ఎదుట విచారణకు వచ్చారు. ఈడీ అధికారులు ముందుగా రమ్మన్నారా..? లేక వ్యక్తిగత కారణాలతో నందుయే ముందుగా హాజరయ్యారా? తెలియాల్సి ఉంది.

డ్రగ్స్‌ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద సినీరంగానికి చెందిన 12 మందికి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 8న రానా విచారణకు రానున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు